Begin typing your search above and press return to search.
RRR థియేట్రికల్ ట్రైలర్ కొత్త డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 4 Dec 2021 1:43 PM GMTమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం RRR సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన RRR ట్రైలర్ రిలీజ్ తేదీ వాయిదా పడగా.. ఇంతలోనే డిసెంబర్ 9 న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
ఇంతకుముందు ట్రైలర్ విడుదలను వాయిదా వేసిన నిర్మాతలు ట్రైలర్ తాజా తేదీని తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోలేని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ``#RRRTట్రైలర్ డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం.. భారీ విస్ఫోటనం కోసం సిద్ధం కండి`` అంటూ మేకర్స్ శనివారం ట్వీట్ చేయగా.. రామ్ చరణ్- ఎన్టీఆర్ వ్యాఖ్యానిస్తూ.. భారతదేశంలో అతిపెద్ద యాక్షన్ డ్రామా అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. #RRR ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల అవుతుంది` అని ట్వీట్లు చేశారు. తాజాగా తేదీ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది.
ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు.. ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. తెలంగాణ గిరిజన యోధుడు కొమరం భీమ్ గా తారక్ నటించారు. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలియా భట్ - అజయ్ దేవగన్- శ్రియా శరణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా.. DVV ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య పాన్-ఇండియా చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు.
ఇంతకుముందు ట్రైలర్ విడుదలను వాయిదా వేసిన నిర్మాతలు ట్రైలర్ తాజా తేదీని తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోలేని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. ``#RRRTట్రైలర్ డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం.. భారీ విస్ఫోటనం కోసం సిద్ధం కండి`` అంటూ మేకర్స్ శనివారం ట్వీట్ చేయగా.. రామ్ చరణ్- ఎన్టీఆర్ వ్యాఖ్యానిస్తూ.. భారతదేశంలో అతిపెద్ద యాక్షన్ డ్రామా అద్భుతాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి. #RRR ట్రైలర్ డిసెంబర్ 9న విడుదల అవుతుంది` అని ట్వీట్లు చేశారు. తాజాగా తేదీ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది.
ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు.. ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. తెలంగాణ గిరిజన యోధుడు కొమరం భీమ్ గా తారక్ నటించారు. అందుకే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలియా భట్ - అజయ్ దేవగన్- శ్రియా శరణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా.. DVV ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య పాన్-ఇండియా చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు.