Begin typing your search above and press return to search.

ఓవర్ సీస్ లో సాలిడ్ ఫిగర్ ని కోట్ చేస్తున్న 'పుష్ప' మేకర్స్ ..?

By:  Tupaki Desk   |   5 March 2021 2:30 AM GMT
ఓవర్ సీస్ లో సాలిడ్ ఫిగర్ ని కోట్ చేస్తున్న పుష్ప మేకర్స్ ..?
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప". ఇది ఇద్దరికీ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. 'అల వైకుంఠపురంలో' తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడం.. 'రంగస్థలం' వంటి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుక్కు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 'పుష్ప' పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఓవర్ సీస్ లో కోట్ చేసిన ధర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బన్నీ - సుకుమార్ గత గత చిత్రాలు 'అల వైకుంఠపురంలో' 'రంగస్థలం' రెండూ ఓవర్ సీస్ లో మంచి వసూళ్ళు రాబట్టాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న 'పుష్ప' చిత్రాన్ని కూడా ఎక్కువ మొత్తానికే అమ్మడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. అయితే కరోనా పాండమిక్ లేనప్పుడు ఆ రెండు సినిమాలకు ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ బాగా దెబ్బ తినింది. కోవిడ్ నేపథ్యంలో అక్కడ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీలో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మేకర్స్ కోట్ చేసే సాలిడ్ ధరతో ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ అవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇకపోతే 'పుష్ప' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అల్లు అర్జున్ కి సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.