Begin typing your search above and press return to search.

'పుష్ప' ట్రైలర్ టీజ్: బన్నీ ఊర మాస్ జాతరకు సర్వం సిద్ధం..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 1:21 PM GMT
పుష్ప ట్రైలర్ టీజ్: బన్నీ ఊర మాస్ జాతరకు సర్వం సిద్ధం..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప". ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో.. రెండు భాగాలుగా ఈ భారీ యాక్షన్ డ్రామాని తీర్చిదిద్దుతున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న ట్రైలర్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.

అయితే 'పుష్ప' మాస్ ఫెస్టివల్ మరో మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుందనగా.. తాజాగా ట్రైలర్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. దట్టమైన అడవులను చూపించడంతో ప్రారంభమైన ఈ వీడియోలో సినిమాలోనిప్రధాన పాత్రలన్నింటికీ భాగం కల్పించారు. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ ఊర మాస్ అవతారాన్ని చూడొచ్చు. బైక్ ఛేజింగ్ సీన్ - జైల్లో బన్నీ ని బంధించి చిత్రహింసలు పెట్టడం - యాక్షన్ సన్నివేశాలు వంటివి చూపించారు.

ట్రైలర్ టీజర్ లో హీరోయిన్ రష్మిక మందన్నా - విలన్స్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ భరద్వాజ్ - అజయ్ ఘోష్ - ధనుంజయ లతో పాటుగా రావు రమేష్ - అజయ్ - శత్రు తదితరులు కనిపించారు. చివర్లో అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకొని ఒక లారీ మీద నుంచి మరో లారీ మీదకు దూకే షాట్ హైలైట్ గా నిలిచింది. మొత్తం మీద ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫిల్మ్ ని చూడబోతున్నట్లు ఈ వీడియో హింట్ ఇస్తోంది. 'పుష్ప' సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో స్థాయిలో ఉంటుందనడానికి ఈ టీజర్ ని ఉదాహరణగా చెప్పొచ్చు.

''పుష్ప: ది రైజ్'' ట్రైలర్ టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. మరో మూడు రోజుల్లో ట్రైలర్ కోసం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. 'ఆర్య' 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితత్వం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పోకుట్టి సౌండ్ డిజైనగ్ గా వ్యవహరిస్తున్నారు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.