Begin typing your search above and press return to search.

ఓటీటీలో రిలీజైనా త‌గ్గేదిలే అంటున్నాడుగా

By:  Tupaki Desk   |   14 Jan 2022 12:30 AM GMT
ఓటీటీలో రిలీజైనా త‌గ్గేదిలే అంటున్నాడుగా
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ కాకుండా హిందీలోనూ పుష్ప‌రాజ్ హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఉత్త‌రాదిలో ఏమాత్రం అంచ‌నాలు లేకుండా.. క‌నీసం ప్ర‌చారం కూడా చేయ‌ని ఈ మూవీ ఇప్పుడు రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టికే నిర్మాత న‌వీన్ యెర్నేని చెప్పిన‌ట్టుగా 300 కోట్లు దాటి మ్యాజిక్ ఫిగ‌ర్ దిశ‌గా ప‌య‌నిస్టోంది. అయితే తాజాగా ఈ మూవీని హిందీ వెర్ష‌న్ మిన‌హా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ వెర్ష‌న్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో క‌లెక్ష‌న్ లు త‌గ్గుతాయ‌ని అంతా భావించారు కానీ పుష్ప‌రాజ్ డైలాగ్ కి త‌గ్గ‌ట్టే ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. క‌లెక్ష‌న్స్ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు స‌రి క‌దా మూవీపై, బ‌న్నీ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కుర‌వ‌డం మొద‌లైంది.

జ‌న‌వ‌రి 7న ఈ మూవీ ఓటీటీలో విడుద‌లైంది. అయితే విడుద‌లైన ద‌గ్గ‌రి నుంచి టీమ్ పై ప్ర‌శంస‌లు జ‌ల్లు ఎక్కువైంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హీరో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయిపోతున్నారు. బ‌న్నీ న‌ట‌నని పొగిడేస్తూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ లు పెడుతూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక క్రికెట‌ర్స్ అయితే ఇక డ‌బ్మాష్ వీడియోలు చేస్తూ `పుష్ప‌`ని దేశ వ్యాప్తంగా వైర‌ల్ చేస్తున్నారు. అంతే కాకుండా `పుష్ప‌` డైలాగ్ చెబుతూ బ‌న్నీ అభిమానులుగా మారిపోతున్నారు. దీంతో ఓటీటీలో విడుద‌లైన త‌రువాత `పుష్ప‌`కు మ‌రింత క్రేజ్ పెరిగింద‌ని, సినిమాకు సెల‌బ్రిటీలో ప్ర‌చార క‌ర్త‌లుగా మారి ప్ర‌మోట్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.

అన్న‌ట్టు ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని లెక్క‌ల మాస్టారు సుకుమార్ `పుష్ప 2`లో భారీ మార్పులు చేస్తున్నారు. యాక్ష‌న్ బ్లాక్ ల‌తో పాటు ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని కూడా మారుస్తున్నార‌ట‌. పైగా నార్త్ ప్రేక్ష‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి బాలీవుడ్ క్రేజీ న‌టుల్ని పార్ట్ 2 కోసం దించేయాల‌నే ప్లాన్ లో వున్నార‌ట‌. మార్చి లో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే.