Begin typing your search above and press return to search.

అఫీషియల్ పోస్టర్స్ తో 'పుష్ప' హిందీ ప్రమోషన్స్ షురూ..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:30 PM GMT
అఫీషియల్ పోస్టర్స్ తో పుష్ప హిందీ ప్రమోషన్స్ షురూ..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప". శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. అందులో పార్ట్-1 ''పుష్ప: ది రైజ్'' సినిమాని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

'పుష్ప' సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ్ లో లైకా సంస్థ.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇన్నాళ్లూ హిందీలో నీ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ తో డీల్ కుదరడంతో హిందీ వెర్షన్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా 'పుష్ప: ది రైజ్' హిందీ మార్కెట్ ప్రమోషన్స్ ను షురూ చేస్తూ అఫీషియల్ పోస్టర్స్ ని మేకర్స్ వదిలారు. అల్లు అర్జున్ పోషిస్తున్న ఊర మాస్ పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన ఈ పొట్టర్స్ నార్త్ ఆడియెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు మరో మూడు రోజుల్లో (డిసెంబర్ 6) న హిందీ ట్రైలర్ రాబోతోందనే అప్డేట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో అల్లు అర్జున్ ని ఇండియాలోనే 'మోస్ట్ పవర్ ఫుల్ స్టైలిష్ యాక్టర్' గా పేర్కొన్నారు. దక్షిణాది భాషల్లో 'ఐకాన్ స్టార్' గా ప్రమోట్ చేస్తుండగా.. హిందీ మార్కెట్ లో మాత్రం డిఫరెంట్ ట్యాగ్ తో ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ లో 'పుష్ప' పార్ట్-1 ను గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ సమర్పణలో ఏఏ ఫిలిమ్స్ సహకారంతో నిర్మాత మనీష్ షా విడుదల చేయనున్నారు.

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాలని ఆలోచనలో ఉన్న బన్నీ.. దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. విడుదలకు గట్టిగా రెండు వారాలే టైం ఉండటంతో.. హిందీ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. డిసెంబర్ 6న ముంబైలో ట్రైలర్ లాంచ్ తో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి.

ఇకపోతే 'పుష్ప: ది రైజ్' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అల్లు అర్జున్ - సమంత లతో ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ - ధనుంజయ - సునీల్ - అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.