Begin typing your search above and press return to search.

చోరీ కేసులో తెలుగు నిర్మాత కొడుకు!

By:  Tupaki Desk   |   24 March 2017 8:54 AM GMT
చోరీ కేసులో తెలుగు నిర్మాత కొడుకు!
X
ప్రముఖ మీడియా లో వచ్చిన కథనాల ప్రకారం "పేరు ప్ర‌ఖ్యాతులున్న ఒక ప్ర‌ముఖ నిర్మాత కొడుకు వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. విన్నంత‌నే అవాక్కు అయ్యేలా చేస్తోంది. ప‌ర్సు కొట్టేసిన ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొంటున్న వైనం విస్మ‌యంగా మారింది. టాలీవుడ్‌ లో సుప‌రిచితుడైన సినీ ప్ర‌ముఖుల్లో ఒక‌రైన చిల్ల‌ర క‌ల్యాణ్ కుమారుడు చిల్ల‌ర వ‌రుణ్ కుమార్‌ పై చోరీ కేసు న‌మోదైంది.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం హైద‌రాబాద్‌ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబ‌రు 12లోని ఎమ్మెల్యే కాల‌నీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారి గురువారం త‌న కొడుకుతో క‌లిసి ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌ కు వ‌చ్చారు. స్విమ్మింగ్ కోసం వ‌చ్చిన ఆయ‌న‌.. ప‌ర్సు ప‌క్క‌న పెట్టి స్నానం చేస్తున్న వేళ‌.. ఆయ‌న ప‌ర్సు మిస్ అయ్యింది. అందులో ప‌లు డెబిట్‌.. క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి.

ప‌ర్సు పోయిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే కార్డులోని బ్యాంకు ఖాతా నుంచి పెద్ద మొత్తంలో న‌గ‌దు బ‌దిలీ కావ‌టంతో పోలీసుల్ని ఆశ్ర‌యించారు. యాక్సిస్ కార్డు నుంచి రూ.1.82 ల‌క్ష‌లు.. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు నుంచి రూ.27,600 మొత్తం చిల్ల‌ర వ‌రుణ్ కుమార్ అకౌంట్లోకి బ‌దిలీ అయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇక‌.. అక్క‌డి సీసీ కెమేరాల ఫుటేజ్‌ ను ప‌రిశీలించ‌గా.. వ‌రుణ్ కుమారే ప‌ర్సు దొంగ‌త‌నం చేసిన‌ట్లుగా స్ప‌ష్ట‌మైంద‌ని చెబుతున్నారు. ఒక ప్ర‌ముఖ నిర్మాత కొడుకు ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది."

Source : DC

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/