Begin typing your search above and press return to search.
దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్... ఈ సారి రజనీకాంత్ పై ఫోకస్
By: Tupaki Desk | 30 Jan 2023 8:00 AM GMT డిస్ట్రిబ్యూటర్గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు.. ప్రస్తుతం టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్నారు. నిర్మాతగా ఎన్ని విజయాలు సాధించినా, డిస్ట్రిబ్యూషన్ను మాత్రం వదిలిపెట్టలేదు. ముఖ్యంగా నైజాం, వైజాగ్ ఏరియాల్లో థియేటర్లపై ఆయనకు మంచి పట్టు ఉందనే చెప్పవచ్చు. దీంతో చాలా సినిమాల రిలీజ్లను శాసించే స్థాయిలో ఉన్నారు దిల్ రాజు. ఇలా టాలీవుడ్లో సాఫీగా జర్నీ సాగిస్తున్న ఆయనకు ఈ సంక్రాంతి ఫలితాలు మింగుడుపడటం లేదనే చెప్పవచ్చు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో ఆయన నిర్మించిన ‘వారసుడు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు. వారసుడు చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయగా.. తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకంటే చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’తో పాటు బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు ఉండటమే అందుకు కారణం. కానీ తమిళనాడులో మాత్రం కలెక్షన్లు బాగానే రాబట్టింది. అయితే ఈ సంక్రాంతికి తన అంచనా తప్పయిందని రియలైజ్ అయిన దిల్ రాజు.. ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించే పనిలో పడ్డారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దిల్ రాజు తాజాగా మరో తమిళ స్టార్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. వారీసు చిత్రంతో తమిళ నిర్మాతగా తమిళనాడులో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మరో స్టార్ హీరో పై దృష్టి పెడుతున్నారు. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం జైలర్. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు కొనడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా మరో కీ రోల్ చేస్తోంది. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఆగస్ట్ 11న SSMB 28 సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశి నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే మాత్రం దిల్ రాజు వర్సెస్ నాగ వంశీ మధ్య వార్ తప్పదనే తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో ఆయన నిర్మించిన ‘వారసుడు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు. వారసుడు చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయగా.. తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకంటే చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’తో పాటు బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలు ఉండటమే అందుకు కారణం. కానీ తమిళనాడులో మాత్రం కలెక్షన్లు బాగానే రాబట్టింది. అయితే ఈ సంక్రాంతికి తన అంచనా తప్పయిందని రియలైజ్ అయిన దిల్ రాజు.. ఈ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించే పనిలో పడ్డారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే దిల్ రాజు తాజాగా మరో తమిళ స్టార్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. వారీసు చిత్రంతో తమిళ నిర్మాతగా తమిళనాడులో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మరో స్టార్ హీరో పై దృష్టి పెడుతున్నారు. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం జైలర్. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దిల్ రాజు కొనడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా మరో కీ రోల్ చేస్తోంది. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే ఆగస్ట్ 11న SSMB 28 సినిమా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశి నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అయితే మాత్రం దిల్ రాజు వర్సెస్ నాగ వంశీ మధ్య వార్ తప్పదనే తెలుస్తోంది.