Begin typing your search above and press return to search.
మణిరత్నం చారిత్రక చిత్రంలో ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 16 Jan 2021 10:30 AM GMTమణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నీయిన్ సెల్వన్ గత కొంతకాలంగా వైరల్ గా చర్చల్లోకొస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ ఇది. భారీ తారాగణం టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీకి పని చేస్తుండడంతో ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక ఈ మూవీలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ విలన్ పాత్రను పోషిస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని సమాచారం. అతను ఇంతకు ముందు 1997 లో `ఇరువర్ బ్యాక్`లో మణిరత్నంతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. అందులో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించింది. ఒక రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పుడు మరోసారి మణిరత్నం మూవీ కోసం సిద్ధమవుతున్నారు.
ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ``పొన్నీఇన్సెల్వన్ .. మాస్టర్ తో ఒక ప్రయాణం .. 25 సంవత్సరాల క్రితం `ఇరువర్` నుండి ప్రారంభమైంది ... తెలియని ఆనందం ... కొత్త ఎత్తులను కనుగొంటాం. ఆనందం తో ఆశీస్సులతో..`` అంటూ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ పోయెటిక్ గా స్పందించారు.
ఈ చిత్రంలో కార్తీ- చియాన్ విక్రమ్- ఐశ్వర్య లక్ష్మి- మోహన్ బాబు- జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి లాక్ డౌన్ లో సుదీర్ఘ విరామం తర్వాత వారం క్రితమే ఈ చిత్రం షూట్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. 2019 లో మొదటి షెడ్యూల్ థాయ్లాండ్ లో పూర్తయింది. అక్కడ దాదాపు 90 రోజులు చిత్రీకరించారు.
తాజా సమాచారం ప్రకారం.. ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని సమాచారం. అతను ఇంతకు ముందు 1997 లో `ఇరువర్ బ్యాక్`లో మణిరత్నంతో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. అందులో ఐశ్వర్యారాయ్ కథానాయికగా నటించింది. ఒక రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ నటించారు. ఇప్పుడు మరోసారి మణిరత్నం మూవీ కోసం సిద్ధమవుతున్నారు.
ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ లో ప్రకటించారు. ``పొన్నీఇన్సెల్వన్ .. మాస్టర్ తో ఒక ప్రయాణం .. 25 సంవత్సరాల క్రితం `ఇరువర్` నుండి ప్రారంభమైంది ... తెలియని ఆనందం ... కొత్త ఎత్తులను కనుగొంటాం. ఆనందం తో ఆశీస్సులతో..`` అంటూ తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ పోయెటిక్ గా స్పందించారు.
ఈ చిత్రంలో కార్తీ- చియాన్ విక్రమ్- ఐశ్వర్య లక్ష్మి- మోహన్ బాబు- జయం రవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి లాక్ డౌన్ లో సుదీర్ఘ విరామం తర్వాత వారం క్రితమే ఈ చిత్రం షూట్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. 2019 లో మొదటి షెడ్యూల్ థాయ్లాండ్ లో పూర్తయింది. అక్కడ దాదాపు 90 రోజులు చిత్రీకరించారు.