Begin typing your search above and press return to search.

మ‌ణిర‌త్నం చారిత్ర‌క చిత్రంలో ప్ర‌కాష్ రాజ్

By:  Tupaki Desk   |   16 Jan 2021 10:30 AM GMT
మ‌ణిర‌త్నం చారిత్ర‌క చిత్రంలో ప్ర‌కాష్ రాజ్
X
మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నీయిన్ సెల్వన్ గ‌త కొంత‌కాలంగా వైర‌ల్ గా చ‌ర్చ‌ల్లోకొస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతున్న భారీ హిస్టారిక‌ల్ మూవీ ఇది. భారీ తారాగ‌ణం టాప్ టెక్నీషియ‌న్స్ ఈ మూవీకి ప‌ని చేస్తుండ‌డంతో ప్ర‌పంచం దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. ఇక ఈ మూవీలో మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్రకాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని స‌మాచారం. అతను ఇంతకు ముందు 1997 లో `ఇరువర్ బ్యాక్`లో మ‌ణిర‌త్నంతో క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో ఐశ్వ‌ర్యారాయ్ క‌థానాయికగా న‌టించింది. ఒక రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌కాష్ రాజ్ న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ణిర‌త్నం మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు.

ప్ర‌కాష్ రాజ్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని అధికారికంగా ట్విట్టర్ ‌లో ప్రకటించారు. ``పొన్నీఇన్సెల్వన్ .. మాస్టర్ తో ఒక ప్రయాణం .. 25 సంవత్సరాల క్రితం `ఇరువర్` నుండి ప్రారంభమైంది ... తెలియని ఆనందం ... కొత్త ఎత్తుల‌ను కనుగొంటాం. ఆనందం తో ఆశీస్సుల‌తో..`` అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌కాష్ రాజ్ పోయెటిక్ గా స్పందించారు.

ఈ చిత్రంలో కార్తీ- చియాన్ విక్రమ్- ఐశ్వర్య ల‌క్ష్మి- మోహన్ బాబు- జయం రవి త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారి లాక్ డౌన్ లో సుదీర్ఘ విరామం తర్వాత వారం క్రితమే ఈ చిత్రం షూట్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. 2019 లో మొదటి షెడ్యూల్ థాయ్‌లాండ్ లో పూర్త‌యింది. అక్క‌డ‌ దాదాపు 90 రోజులు చిత్రీకరించారు.