Begin typing your search above and press return to search.

లేటెస్ట్ క్లిక్: ఇటలీ వీధుల్లో పిల్లలతో సరదాగా గడుపుతున్న యంగ్ రెబల్ స్టార్..!

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:00 PM GMT
లేటెస్ట్ క్లిక్: ఇటలీ వీధుల్లో పిల్లలతో సరదాగా గడుపుతున్న యంగ్ రెబల్ స్టార్..!
X
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో 'బాహుబలి' నిలిచిపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో మన డార్లింగ్ ప్రభాస్ కి ఇతర దేశాల్లో కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా అందరూ అతని చుట్టూ గుమిగూడుతున్నారు. ప్రస్తుతం 'రాధే శ్యామ్' షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న ప్రభాస్.. అక్కడి పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ఫోటోలలో ఫుల్ నెక్ టీషర్ట్ మరియు స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకొని ప్రభాస్ ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నాడు.

కాగా, కరోనా కారణంగా నిలిచిపోయిన ప్రభాస్ ''రాధేశ్యామ్'' షూటింగ్ ఇటీవలే ఇటలీలో తిరిగి ప్రారంభమైంది. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణా మూవీస్ - టీ సిరీస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాత ప్రభాస్ 'ఆదిపురుష్' మరియు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్స్ లో నటించనున్నాడు.