Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్ ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్ ప్లాన్ మారింది

By:  Tupaki Desk   |   15 May 2022 2:30 AM GMT
రాధేశ్యామ్ ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్ ప్లాన్ మారింది
X
'రాధేశ్యామ్‌'.. భారీ బ‌డ్జెట్ తో తీసిన సినిమా, దాదాపు రెండేళ్లు వేచి చూసిన సినిమా.. ఇలాంటి ప్రాజెక్ట్ ల‌పై ఎవ‌రైనా స‌రే గ‌ట్టి న‌మ్మ‌కంతోనే వుంటారు. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధిస్తుద‌ని ధీమాని వ్య‌క్తం చేస్తుంటారు. ప్ర‌భాస్ అదే చేశాడు. రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాం. వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశాం. ఇంట్రెస్ట్ లే భారీగా క‌ట్టాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ఎలాగైనా స‌క్సెస్ చేయండి అని ప్ర‌తీ ఒక్క‌రినీ రిక్వెస్ట్ చేశారు. కానీ ఫ‌లితం మాత్రం మ‌రోలా వ‌చ్చింది.

భారీ అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఫ్యాన్స్ తో పాటు ప్ర‌భాస్ కు కూడా ఊహించ‌ని షాకిచ్చింది. ప్ర‌భాస్ కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ సినిమాగా రికార్డు సాధించింది. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ఊమించిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాప్ గా మాన‌డంతో ఒక్క‌సారిగా ఆలోచ‌న‌లో ప‌డిన ప్ర‌భాస్ త‌న ప్లాన్ కంప్లీట్ గా మార్చేసుకున్నాడట‌. తొంద‌ర‌పాటు నిర్ణయాలు తీసుకోకూడ‌ద‌ని భావించి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌.

ముందు అనుకున్న ప్ర‌కారం మాత్రం 'రాధేశ్యామ్‌' ఫ‌లితానికి ముందు మారుతిలో సినిమా సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి ఆ త‌రువాతే 'స‌లార్‌'ని కంప్లీట్ చేయాల‌నుకున్నార‌ట‌. కానీ డామిట్ క‌థ అడ్డంతిర‌గ‌డంతో త‌న ప్లాన్ మార్చుకుని 'స‌లార్‌' ని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌.

ప్ర‌స్తుతం 'స‌లార్‌' షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. దీనితో పాటు నాగ్ అశ్విన్ 'ప్రాజెక్ట్ కె', సందీప్ వంగ 'స్పిరిట్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ పూర్త చేయాల‌ని ఫిక్సయ్యార‌ట ప్ర‌భాస్ దాంతో మారుతి సినిమా మ‌ళ్లీ వెన‌క్కి వెళ్లిపొయింద‌ని చెబుతున్నారు.

'స‌లార్‌' తో పాటు ప్ర‌స్తుతం 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో నూ ప్ర‌భాస్ పాల్గొంటున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దిశా ప‌టాని, ప్ర‌భాస్ ల క‌ల‌యిక‌లో కీల‌క సీన్ ల‌ని షూట్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని దిషా ఇండైరెక్ట్ గా వెల్ల‌డించి ప్ర‌భాస్ ఫుడ్డుతో చంపేస్తున్నాడ‌ని వెల్ల‌డించి అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ఈ షెడ్యూల్ పూర్త‌య్యాక వెంట‌నే ప్ర‌భాస్ 'స‌లార్‌' షూటింగ్ లో పాల్గొంటార‌ట‌. ఈ మూవీని న‌వంబ‌ర్ నాటికి కంప్లీట్ చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ఆలోచ‌న. అంటే 2023 స‌మ్మ‌ర్ కు ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నార‌న్న‌మాట‌.

ఇక ప్ర‌భాస్ న‌టించిన 'ఆది పురుష్' వ‌చ్చ ఏడాది జన‌వరిలో సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఈ భారీ షెడ్యూల్ లో మారుతి సినిమాని ప్ర‌భాస్ ఈ ఏడాది ప‌ట్టాలెక్కించ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మారుతి సినిమా నెక్స్ట్ ఇయ‌ర్ కి పోస్ట్ పోన్ కావ‌డం ఖాయం అని ఇన్ సైడ్ టాక్‌.