Begin typing your search above and press return to search.

'మహాసముద్రం' ట్రైలర్ పై పాన్ ఇండియా స్టార్ స్పందన..!

By:  Tupaki Desk   |   25 Sep 2021 9:30 AM GMT
మహాసముద్రం ట్రైలర్ పై పాన్ ఇండియా స్టార్ స్పందన..!
X
'Rx 100' వంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''మహాసముద్రం''. ఇందులో వర్సటైల్ యాక్టర్స్ శర్వానంద్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇన్టెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు - టీజర్ - రెండు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో 6.5 మిలియన్ల వ్యూస్ - 190K+ లైక్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్ పై స్పందించారు.

'మహాసముద్రం' ట్రైలర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రభాస్.. ఇంటెన్స్ గా ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు. శర్వానంద్ - సిద్దార్థ్ లతో పాటుగా చిత్ర యూనిట్ మొత్తానికి యంగ్ రెబల్ స్టార్ విషెస్ తెలిపారు. శర్వానంద్ - ప్రభాస్ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. శర్వా నటించే ప్రతీ సినిమాకి ప్రభాస్ తనవంతు సపోర్ట్ ఇస్తుంటారు. ఇప్పుడు 'మహాసముద్రం' చిత్రానికి కూడా ప్రభాస్ మద్దతు లభించింది. ఎంకరేజింగ్ పోస్ట్ పెట్టినందుకు చిత్ర బృందం డార్లింగ్ కు కృతజ్ఞతలు తెలిపింది. శర్వానంద్ సైతం 'థాంక్స్ అన్న' అంటూ ప్రభాస్ పోస్ట్ పై కామెంట్ చేశారు.

కాగా, 'మహాసముద్రం' చిత్రాన్ని AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అదితిరావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు - రావు రమేష్ - కేజీయఫ్ గరుడ రామ్ - శరణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ సమకూర్చారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించారు. విజయ దశమి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి 'మహా సముద్రం' ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.