Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ‌తో అఖిల్ కి కుదిరింద‌మ్మా

By:  Tupaki Desk   |   23 Jan 2020 4:48 AM GMT
బుట్ట బొమ్మ‌తో అఖిల్ కి కుదిరింద‌మ్మా
X
హిట్టు హీరోయిన్‌ వెంట ప‌డ‌డం.. క్రేజు ఉన్న భామ‌ల్ని బ‌రిలో దించ‌డం ఒక ర‌క‌మైన టాక్టీస్. యంగ్ హీరోల సినిమాల‌కు ఈ ఫార్ములాని అప్ల‌య్ చేయ‌డం చూస్తున్న‌దే. డెబ్యూ బెల్లంకొండ శ్రీ‌ను స‌ర‌స‌న స‌మంత‌.. త‌మ‌న్నా.. పూజా హెగ్డే లాంటి భామ‌ల్నే బ‌రిలో దించారు. స్టార్ హీరోయిన్ స్టార్ కాస్టింగ్ పేరుతో బిజినెస్ ని పెద్ద ఎత్తున చేశారు. అయితే ఈసారి అఖిల్ 4కి అలాంటి ప్లాన్ చేశారా? అంటే.. అవున‌నే అనిపించ‌క‌మాన‌దు.

అక్కినేని అఖిల్ క‌థా నాయ‌కుడిగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో పూజా హెగ్డేని క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌డం వెన‌క స్ట్రాట‌జీ అదే. వాస్త‌వానికి యంగ్ అఖిల్ స‌ర‌స‌న పూజా పేరు వినిపించ‌గానే ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చాక్లెట్ బోయ్ స‌ర‌స‌న‌ ముదురు భామ‌ను తీసుకున్నారేం అంటూ సోష‌ల్ మీడియాలో చాలా పెద్ద డిబేట్ ర‌న్ అయ్యింది. కానీ భాస్క‌ర్ అండ్ టీమ్ అదేమీ ప‌ట్టించుకోకుండా పూజానే ఎంపిక చేసుకున్నారు. అప్ప‌టికే పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ స్టాట‌స్ తో వెలిగి పోతోంది కాబ‌ట్టి అది ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌ని భావించారో లేక క‌థ డిమాండ్ చేసిందో కానీ భాస్క‌ర్ మాత్రం పూజాకే ఓకే చెప్పారు.

ఇటీవ‌లే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ పూజా త‌న ఖాతాలో వేసుకుంది కాబ‌ట్టి అది అఖిల్ కి ప్ల‌స్ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం అఖిల్ - పూజా జంట‌పై రొమాంటిక్ సీన్స్ స‌హా పాట‌ల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ లీకులు ఇస్తున్నారు. అయితే చాక్లెట్ బోయ్ లా ఉండే అఖిల్ స‌ర‌స‌న పూజా సెట్ట‌య్యిందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఆ జంట‌కు సంబంధించిన లుక్ ఏదైనా రివీల్ కావాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ అఖిల్ 4 కి సంబంధించిన స‌రైన లుక్ ఏదీ రివీల్ కానే లేదు. చివ‌రి షెడ్యూల్లో అడుగుపెట్టారు. క‌నీసం ఇక‌నైనా ఈ సినిమా ప్ర‌చారం మొద‌లెడ‌తారేమో చూడాలి.

కొన్నిటిని మ‌రీ ఎక్కువ దాచేసినా ప్ర‌మాద‌మే. మ‌రి అఖిల్ - పూజా లుక్ ని అయినా రిలీజ్ చేస్తే ఆడియెన్ ఓ అంచ‌నాకి వ‌స్తారు. అఖిల్ - హ‌లో- మిస్ట‌ర్ మ‌జ్ను .. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేసినా అఖిల్ కి ల‌క్ క‌లిసి రాలేదు. క‌నీసం ఈ నాలుగో ప్ర‌య‌త్నం అయినా స‌క్సెస‌వ్వాల‌ని ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా గీతా ఆర్ట్స్ సంస్థ‌ నిర్మిస్తోంది