Begin typing your search above and press return to search.
ఇటలీలో ప్రభాస్ టీం అందరికి సమానమైన ఏర్పాట్లు
By: Tupaki Desk | 19 Oct 2020 3:45 AM GMTప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'రాధేశ్యామ్' షూటింగ్ ఇటలీలో జరుగుతున్న విషయం తెల్సిందే. కరోనా నేపథ్యంలో చాలా జాగ్రత్తల మద్య షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. సాదారణంగా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన సమయంలో హీరో హీరోయిన్ లకు లగ్జరీ వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది. కాని రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రతి ఒక్క టీం మెంబర్ కు వీఐపీ ట్రీట్మెంట్ తో హోటల్ లో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారట. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశ్యంతో అందరికి కూడా సమానమైన ఏర్పాట్లను స్వయంగా ప్రభాస్ చేయించాడట. అలా అయితే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయినా కూడా పర్వాలేదు అనుకుని యూనిట్ సభ్యులు అందరి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పాట్ బాయ్ నుండి అందరికి కూడా సమానమైన వసతులను హోటల్ లో కల్పించారట.
యూవీ క్రియేషన్స్ రాధేశ్యామ్ సినిమాను బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1980 కాలం నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమ కథతో రూపొందిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ మరియు పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇటలీలో వచ్చే నెల వరకు షూటింగ్ చేసి ఆ తర్వాత తిరిగి రాబోతున్నారు. దాంతో దాదాపుగా షూటింగ్ పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
యూవీ క్రియేషన్స్ రాధేశ్యామ్ సినిమాను బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 1980 కాలం నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమ కథతో రూపొందిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ మరియు పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇటలీలో వచ్చే నెల వరకు షూటింగ్ చేసి ఆ తర్వాత తిరిగి రాబోతున్నారు. దాంతో దాదాపుగా షూటింగ్ పూర్తి అయినట్లే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.