Begin typing your search above and press return to search.

ప్రభాస్ సరసన ఆ హీరోయిన్ డ్యూయెల్ రోల్ పోషిస్తుందా..?

By:  Tupaki Desk   |   14 Aug 2020 5:00 PM GMT
ప్రభాస్ సరసన ఆ హీరోయిన్ డ్యూయెల్ రోల్ పోషిస్తుందా..?
X
ప్రస్తుతం తెలుగు వెండితెర పై అందాల భామ పూజ హెగ్డే హవా మాములుగా లేదు. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. 'అరవింద సమేత', మహర్షిల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా కూడా ఉంది. కరోనా వైరస్ వలన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. స్వీయ నిర్బంధంలో ఉన్న పూజ ఇంట్లో సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇదివరకే పూజా హెగ్డే క్లాసికల్ డాన్సర్ గా మారిందట.

త్వరలోనే తన క్లాసికల్ నృత్య కళ మొత్తం సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతోంది. దీనికోసం ఆమె 3 నెలల కిందటే ట్రయినింగ్ తీసుకుంది" అంటూ ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే పాత్రకు సంబంధించి అన్నారు. ఎన్నడూలేని విధంగా ఈ పుకార్లపై ప్రభాస్ చిత్ర యూనిట్ స్పందించి.. ప్రభాస్ సరసన నటిస్తున్న పూజా హెగ్డే.. ఈ సినిమాలో క్లాసికల్ డాన్సర్ కాదని తేల్చిచెప్పింది. అయితే 1960ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. కథకు తగ్గట్టు పూజా హెగ్డే కూడా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుందని టాక్ నడుస్తుంది. ఇక ఇటీవలే సినిమా టైటిల్ రాధేశ్యామ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పూజా ఈ సినిమాతో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లో కూడా నటిస్తుంది.