Begin typing your search above and press return to search.

పూజా గ్యాంగ్ లో 3 మిలియ‌న్ల మంది..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 1:13 PM GMT
పూజా గ్యాంగ్ లో 3 మిలియ‌న్ల మంది..!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ ఆడియ‌న్స్ ను అమితంగా ఆక‌ర్షిస్తున్న అందం ఏదైనా ఉందంటే.. అది పూజా హెగ్డే బ్యూటీ మాత్ర‌మే! ఇక‌, ఆమె ఫ్యాన్స్ అయితే అమితంగా ఆరాధిస్తూ.. నిత్యం ప్రేమ పూజ చేస్తుంటారు. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా.. మొత్తం సౌత్ లోనే త‌న స‌త్తా చాటుకుంది.

ముకుందతో తెరంగేట్రం చేసిన ఈ నటి.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. త‌గిన గుర్తింపు రాలేదు. అయితే.. అల్లు అర్జున్ దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమాల‌తో అమ్మ‌డి గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరుగుతూ వ‌చ్చింది. గ‌తేడాది వ‌చ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. పూజా టాప్ స్టార్ గా మారిపోయింది.

ఈ చిత్రం తర్వాత అమ్మడి ఫ్యాన్స్ లిస్ట్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పూజా సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన లైఫ్, కెరీర్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ట్విట‌ర్ లో మ‌రో మైలు రాయిని అందుకుందీ బ్యూటీ.

ట్విట‌ర్ లో 3 మిలియన్ల ఫాలోవ‌ర్ల మార్కును చేరుకుంది పూజా. కేవ‌లం ట్విట‌ర్లోనే కాదు.. ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్ లో కూడా భారీగా అభిమానుల‌ను సంపాదించుకుందీ బుట్ట‌బొమ్మ‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండ‌గా.. ఫేస్‌బుక్‌లో 5.9 మిలియన్ల మంది పూజాను అనుస‌రిస్తున్నారు. దీంతో ఇటు పూజాతోపాటు అటు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

కాగా.. పూజా హెగ్డే ప్ర‌స్తుతం ప్రభాస్ తో క‌లిసి ‘రాధే శ్యామ్’ సినిమాలో న‌టిస్తోంది. కాగా.. అఖిల్ అక్కినేనితో క‌లిసి న‌టించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఈ స‌మ్మ‌ర్ లో రిలీజ్ కానుంది. అంతేకాకుండా.. బాలీవుడ్ చిత్రం ‘సర్కస్’ లోనూ ఈ అమ్మడు నటిస్తోంది.