Begin typing your search above and press return to search.

2022 ని బుట్ట‌బొమ్మకు రాసిచ్చేశారు!

By:  Tupaki Desk   |   14 Jan 2022 12:30 AM GMT
2022 ని బుట్ట‌బొమ్మకు రాసిచ్చేశారు!
X
కొంద‌రికి మాత్ర‌మే అదృష్టం గ్రాఫ్‌ పైపైకి ప‌రుగులు పెడుతుంది. గ‌డిచిన రెండు మూడేళ్లుగా పూజా హెగ్డే- ర‌ష్మిక మంద‌న‌ల గ్రాఫ్ అమాంతం స్కైని ట‌చ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు 2022లో నువ్వా నేనా? అంటూ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. అయితే ర‌ష్మిక‌తో పోలిస్తే ఒక మెట్టు పైనే ఉంది బుట్ట‌బొమ్మ‌.

పూజా హెగ్డే 2022లో ఐదు విడుదలలను క‌లిగి ఉంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్.. విజయ్ స‌ర‌స‌న బీస్ట్.. రణవీర్ సింగ్ సరసన సర్కస్.. చిరంజీవి- రామ్ చరణ్‌లతో ఆచార్య ఇవ‌న్నీ ఈ ఏడాదిలోనే రిలీజ‌వుతున్నాయి. వీటిలో కొన్ని నెల గ్యాప్ తోనే రానున్నాయి. మహేష్ బాబు సరసన ఇంకా పేరు పెట్టని చిత్రంలోనూ న‌టించ‌నుంది.

గత సంవత్సరం వ‌రుస చిత్రాల‌తో స్ఫూర్తినింపిన పూజా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తో అఖిల్ కి హిట్టిచ్చింది. 2022 లో త‌న హీరోలంద‌రికీ ల‌క్కీ ఛామ్ గా మారుతోంది. 2022 నాటికి నేను తెలివైన మనుషులతో బిజీ అవ్వాల‌ని ప్రేక్షకులు గుర్తుంచుకునే సినిమాల్ని అందించాలని నిశ్చయించుకున్నాను. నేను నా ప‌నిలో కొత్త‌ద‌నాన్ని హైట్స్ ని అన్వేషించాలనుకుంటున్నాను. ప్రేక్షకులు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు న‌న్ను ఉత్తేజ‌ప‌రుస్తార‌ని భావిస్తున్నాను`` అని తెలిపారు.

`అల` రెండేళ్లుగా జ‌నం నోళ్ల‌లోనే..

తన ఇండ‌స్ట్రీ హిట్ చిత్రం అల వైకుంఠపుర‌ములో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున గత రాత్రి ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యేక ప్రశ్నోత్తరాల సెషన్ ను నిర్వహించింది. ఈ సెషన్ లో ఆమె అనుచరులలో ఒకరు ``మీరు అత్యంత సరదాగా షూటింగ్ చేసిన సన్నివేశం ఏది? అని అడిగారు. దానికి పూజా స‌మాధానం ఆస‌క్తిక‌రం. అల్లు అర్జున్- నివేదా థామస్- సుశాంత్ లతో ఆఫీస్ లో సరదాగా సాగిన సన్నివేశమిది అని పూజా తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ సన్నివేశాన్ని థియేటర్ లేదా OTT వెర్షన్ లలో ఎప్పుడూ విడుదల చేయలేదు అని పూజా చెప్పారు. తొలగించిన సన్నివేశాన్ని మేకర్స్ త్వరలో యూట్యూబ్‌లో విడుదల చేయాలని కూడా ఆమె కోరుకుంది.