Begin typing your search above and press return to search.

ప్రభాస్ ని చూస్తే నేనే ఆగలేకపోతున్నా..అంటున్న హీరోయిన్!

By:  Tupaki Desk   |   1 April 2020 3:03 PM GMT
ప్రభాస్ ని చూస్తే నేనే ఆగలేకపోతున్నా..అంటున్న హీరోయిన్!
X
బాహుబలితో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న డార్లింగ్ ప్రభాస్ రోజురోజుకి తన 20వ సినిమా షూటింగులో బిజీగా అయిపోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను చకచకా పూర్తీచేస్తున్నాడు. అయితే ఇటీవలే జార్జియాలో షెడ్యూల్ పూర్తీ చేసుకొని చిత్రయూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని యూరప్ లో ప్లాన్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం 'ఓ డియర్' అనే నామమాత్రపు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మేజర్ పార్ట్ లాక్ డౌన్ తరువాత షూట్ చేయనున్నారట.

ఒక పాపులర్ ఇంగ్లీష్ మ్యాగజైన్ తో మాట్లాడిన పూజ హెగ్డే మాట్లాడుతూ.. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ప్రభాస్ అభిమానులకు పండగలా ఉండబోతుంది. ప్రభాస్ ని ఇంతవరకు చూడని స్టైల్ తో - బాడీ లాంగ్వేజ్ తో చూపించనున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. ప్రతీ ఫ్రేమ్ లో ప్రభాస్ విజువల్ వండర్ గా కన్పిస్తాడు. త్వరలో తెరకెక్కించనున్న షెడ్యూల్ లో ప్రభాస్ కి - నాకు బ్యూటిఫుల్ రొమాన్స్ ని షూట్ చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సినిమాను యూవీ బ్యానర్ - గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి పూజ చెప్పినట్లుగా త్వరగా షూటింగ్ పూర్తయితే డార్లింగ్ అభిమానులలో నిజంగానే పండగ వాతావరణం నెలకొంటుంది.