Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : 'రంగ్‌ దే' దసరా స్పెషల్‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 9:10 AM GMT
ఫొటోటాక్‌ : రంగ్‌ దే దసరా స్పెషల్‌
X
నితిన్‌ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్‌ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రంగ్‌ దే. ఈ సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్‌ ను యూరప్‌ లో చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్‌ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. లాక్‌ డౌన్‌ తర్వాత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్‌ సభ్యులు యూరప్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారు. ఇక నేడు దసరా సందర్బంగా ఈ పోస్టర్‌ ను విడుదల చేశారు.

ఇది మూవీ స్టిల్‌ లేదా మేకింగ్‌ స్టిల్‌ ఏది అయినా కూడా పోస్టర్‌ లో కీర్తి మరియు నితిన్‌ ల జోడీకి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌ మరియు వీడియోలతో క్లారిటీ వచ్చింది. నితిన్‌ పెళ్లి సందర్బంగా విడుదలైన ప్రోమోతో సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ గా ఉంటుందని.. మాస్ ఆడియన్స్‌ ను కూడా మెప్పించేలా ఈ సినిమా ను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.