Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతిపై అనుమానాలు రేకిత్తించే స్టోరీ షేర్ చేసిన పాయల్...!

By:  Tupaki Desk   |   3 July 2020 5:30 PM GMT
సుశాంత్ మృతిపై అనుమానాలు రేకిత్తించే స్టోరీ షేర్ చేసిన పాయల్...!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణంపై పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని వచ్చినప్పటికీ.. బలవన్మరణం చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా? సూసైడ్ చేసుకోడానికి గల కారణాలను ఏమిటి? అని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే సుశాంత్ మరణంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక సుశాంత్ సూసైడ్ పై అనేక అనుమానాలున్నాయని.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. దీనికి తోడు సీనియర్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ అనేక అనుమానాలను లేవనెత్తుతూ సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ దర్యాప్తుకి అప్పగించాలని డిమాండ్ చేసారు. అయితే ఇప్పుడు తాజాగా సుశాంత్ విషయంలో ఇదే జరిగి ఉంటుందని ఓ స్టోరీ సోషల్ మీడయాలో చక్కర్లు కొడుతోంది. ఆ స్టోరీని హీరోయిన్ పాయల్ రాజ్‌ పుత్ షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

పాయల్ రాజ్ పుత్ సుశాంత్ మృతి చెందినప్పటి నుండి అతని గురించి యాక్టీవ్ గా పోస్టులు పెడుతూ వస్తోంది. ఈ క్రమంలో సుశాంత్ సూసైడ్ చేసుకుంటున్నట్టుగా వేసిన ఆర్ట్‌ ను షేర్ చేస్తూ.. సుశాంత్ ఫ్యాన్స్ సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని కోరుతున్నారని చెబుతూ సీబీఐ ఎంక్వైరీకి మద్దతు తెలిపింది. ఇక సుశాంత్‌ ను అందరూ కలిసి అలా చంపి ఉంటారని వేసిన ఓ ఆర్ట్ చిత్రాన్ని కూడా పాయల్ షేర్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీని కూడా ఇంస్టాగ్రామ్ లో తన స్టోరీగా పోస్ట్ చేసింది. ఈ స్టోరీలో సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పడానికి పాజిబిలిటీస్ అంటూ ఓ కథనం పోస్ట్ చేసారు సుశాంత్ ఫ్యాన్స్.

దీని ప్రకారం సుశాంత్ మేనేజర్ దిశాని యువ హీరో సూరజ్ పచోరి గర్భవతిని చేసి.. గర్భాన్ని తొలగించుకోడానికి నిరాకరించిన దిశాని సల్మాన్ ఖాన్ సాయంతో బెదిరించారని.. గతంలో జియాఖాన్ ని కూడా ఇలానే చేసి ఆమె చావుకి కారణమయ్యారని పేర్కొన్నారు. దీని గురించి మేనేజర్ దిశా సుశాంత్ కి చెప్పిందని.. దీని గురించి మీడియాకి చెప్పాలని సుశాంత్ అనుకున్నాడని.. ఈ విషయాన్ని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి చెప్పగా ఆమె మహేష్ భట్ కి చేరవేసిందని.. సుశాంత్ తో క్లోజ్ గా ఉండే సందీప్ సింగ్ కూడా సూరజ్ కి ఇంఫార్మర్ గా వ్యవహరించారని.. ఆ సమయంలోనే దిశా అనుమానాస్పదంగా 14 అంతస్తుల భవనం నుండి క్రిందపడి చనిపోయిందని.. దీనిపై సుశాంత్ ఎక్కడ మీడియాకి లీక్ చేస్తాడో అని ప్లాన్ ప్రకారమే మర్డర్ చేసి సూసైడ్ గా చిత్రీకరించి ఉంటారని ఈ స్టోరీలో పేర్కొన్నారు. అందుకే సుశాంత్ కేసుని సీబీఐ కి అప్పగిస్తే నిజా నిజాలు బయటకి వస్తాయని వారు కోరుతున్నారు. ఇప్పుడు ఈ స్టోరీని పాయల్ రాజ్ పుత్ షేర్ చేయంతో ఇది వైరల్ అయింది.