Begin typing your search above and press return to search.

ప‌వన్ రీఎంట్రీ ముహూర్తం ఫిక్స్

By:  Tupaki Desk   |   12 Dec 2019 4:14 AM GMT
ప‌వన్ రీఎంట్రీ ముహూర్తం ఫిక్స్
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ గురించి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌థానాయ‌కుడిగా పింక్ రీమేక్ ని తెర‌కెక్కించేందుకు దిల్ రాజు- బోనీ క‌పూర్ బృందం స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే గ‌త కొంత‌కాలంగా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేకుండా స్థ‌బ్ధుగా ఉండ‌డంతో అస‌లు ప‌వ‌న్ ఈ చిత్రానికి అంగీక‌రించారా లేదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. పింక్ తెలుగు రీమేక్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఈ శుక్ర‌వారం ఉద‌యం నిర్మాత దిల్ రాజు కార్యాల‌యం(హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాలు లాంఛ‌నంగా జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. అయితే ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌వుతారా లేదా? అన్న‌దానికి స‌రైన స‌మాచారం లేదు. వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. క‌థానాయిక‌లు.. ఇత‌ర న‌టీన‌టులు.. టెక్నీషియ‌న్స్ వివ‌రాలేవీ బ‌య‌ట‌కు రివీల్ కాలేదు.

అయితే ఇప్ప‌టికే వేణు శ్రీ‌రామ్ బృందం రీమేక్ స్క్రిప్టును రెడీ చేశార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఈ చిత్రంలో లాయ‌ర్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. బాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన క‌ల్ట్ క్లాసిక్ చిత్రం పింక్ త‌మిళంలో త‌ళా అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో రీమేకై అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఆ క్ర‌మంలోనే దిల్ రాజు - బోని బృందం ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తెలుగు రీమేక్ కి స‌న్నాహాలు చేశారు. గ‌త కొంత‌కాలంగా రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న జ‌న‌సేనాని ఎట్ట‌కేల‌కు ఈ రీమేక్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తుండ‌డంపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.