Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఆ చానెల్ ను కొన్నారా?

By:  Tupaki Desk   |   18 July 2018 10:36 AM GMT
ప‌వ‌న్ ఆ చానెల్ ను కొన్నారా?
X
కొద్ది రోజుల క్రితం కొన్ని తెలుగు న్యూస్ చానెళ్లపై జ‌న‌సేన అధినేత‌ - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుగుబాటు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై కొంత‌కాలం నుంచి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని....ఆ చానెళ్ల వైఖ‌రిని ప‌వ‌న్ ఎండగ‌ట్టారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కు సంబంధించిన కార్య‌క్రమాల‌పై స‌ద‌రు చానెళ్లు పెద్ద‌గా శ్ర‌ద్ధ వ‌హించ‌లేదు. అంత‌కుముందు నుంచి సొంత‌గా ఓ చానెల్ ను ప్రారంభించాల‌ని ప‌వ‌న్ యోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఓ ప్ర‌ముఖ న్యూస్ చానెల్ ను ప‌వ‌న్ కొన‌బోతున్నార‌న్న వార్త కొద్ది రోజులుగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ....తాజాగా చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. జ‌న‌సేన ఐటీ వింగ్ కార్యాల‌యం ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ప‌వ‌న్ అక్క‌డకు వ‌చ్చిన 99 టీవీ చానెల్ విలేక‌రి ద‌గ్గ‌ర మైక్ తీసుకొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ మైక్ ను ఎగాదిగా చూసిన ప‌వ‌న్.....``ఓహ్ మ‌న‌దే``అని అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తాజాగా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో 99టీవీ చానెల్ ను ప‌వ‌న్, ఆయ‌న స‌న్నిహితులు కొన్న‌ట్లుగా ...సోష‌ల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఆ చానెల్ మైక్ ను చూసిన ప‌వ‌న్...`ఓహ్ మ‌న‌దే` అని అంటూ చిరున‌వ్వు చిందించ‌డంతో ఈ పుకార్ల‌కు బ‌లం చేకూరింది. వాస్త‌వానికి - 99 టీవీ చానెల్ ను త‌మ్మారెడ్డి స్థాపించారు. ఆయ‌న చిరంజీవికి - మెగా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు. అదీగాక‌, జ‌న‌సేన‌లో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్..ఓ చానెల్ ను కొన్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లతో చంద్రశేఖ‌ర్, ప‌వ‌న్ కొన్నది ఈ చానెల్ అని చాలా మంది క‌న్ ఫ‌మ్ చేస్తున్నారు. అయితే, ఈ విష‌యంపై ఇప్ప‌టికీ ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.