Begin typing your search above and press return to search.
పఠాన్ @ రూ.300కోట్ల.. కేజీయఫ్, బాహుబలి రికార్డ్స్ బ్రేక్
By: Tupaki Desk | 28 Jan 2023 2:00 PM GMTబాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం బాలీవుడ్కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుంది. విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎదుర్కొన్నా ఈ చిత్రం.. బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. తమ కలెక్షన్లతో విమర్శలు చేసిన వారి నోరు మూయిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది. బాయ్కాట్ గ్యాంగ్ను బెంబేలెత్తిస్తోంది. తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ను అందుకున్న ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యే సరికి అంతకుమించిన రేంజ్ల్ కలెక్షన్స్ను అందుకుంటోంది.
జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిసింది. ఓవర్సీస్లో రూ.100కోట్లకు పైగా గ్రాస్ను సాధించింది. ఓవర్సీస్లో షారుక్ సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి.
దీని బట్టి బాద్షా స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. బాక్సాఫీస్కే మైండ్ బ్లాంక్ అయింది. తద్వారా ఇండియాలో మూడు రోజుల్లో ఎక్కువ రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే, హిందీలోనూ టాప్ మూవీగా సంచలనం సృష్టించింది.
నాన్ హాలీడేస్ను ఈ రేంజ్లో పఠాన్ కలెక్షన్స్ అందుకుంటే ఇక ఈ రెండు రోజులు హాలిడేస్ కాబట్టి మరో రూ 200 కోట్లు అందుకోవడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏ జెంట్గా కనిపించారు. దీపికా పడుకొణె.. షారుక్ సరసన నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించి అదరగొట్టారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూ. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందించారు.
భారతదేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్ను పఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. కథ కన్నా యాక్షన్ అంశాలకే అధికంగా ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిసింది. ఓవర్సీస్లో రూ.100కోట్లకు పైగా గ్రాస్ను సాధించింది. ఓవర్సీస్లో షారుక్ సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి.
దీని బట్టి బాద్షా స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. బాక్సాఫీస్కే మైండ్ బ్లాంక్ అయింది. తద్వారా ఇండియాలో మూడు రోజుల్లో ఎక్కువ రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే, హిందీలోనూ టాప్ మూవీగా సంచలనం సృష్టించింది.
నాన్ హాలీడేస్ను ఈ రేంజ్లో పఠాన్ కలెక్షన్స్ అందుకుంటే ఇక ఈ రెండు రోజులు హాలిడేస్ కాబట్టి మరో రూ 200 కోట్లు అందుకోవడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏ జెంట్గా కనిపించారు. దీపికా పడుకొణె.. షారుక్ సరసన నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించి అదరగొట్టారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూ. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో ఈ మూవీ రూపొందించారు.
భారతదేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్ను పఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. కథ కన్నా యాక్షన్ అంశాలకే అధికంగా ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.