Begin typing your search above and press return to search.
#నిశ్శబ్ధం: తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండిక!
By: Tupaki Desk | 26 Sep 2020 7:00 AM GMT`నిశ్శబ్దం` టీమ్ మూవీ టైటిల్ కి దగ్గట్టే నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తోందా? అంటే అవుననే ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ మూవీ అక్టోబర్ 2న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్ సమయం దగ్గర పడుతున్నా టీమ్ నుంచి ఎలాంటి హడావిడి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రిలీజ్ కి మరో వారమే సమయం వున్నా కీలక పాత్రలో నటించిన హీరోయిన్ అనుష్క గానీ.. టీమ్ గానీ ప్రమోషన్స్ పరంగా ఎలాంటి సందడి చేయడం లేదు.
ఈ మూవీకి ముందు నాని- సుధీర్బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వి` మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ ని భుజాలకి ఎత్తుకున్న నాని- సుధీర్బాబు- నివేదా థామస్ తమ వంతు పబ్లిసిటీకి కృషి చేశారు. కానీ `నిశ్శబ్దం` టీమ్ మాత్రం ఇలాంటివి ఏమీ చేయడం లేదు. పైగా గూగుల్ ప్రకటనలు కూడా పెద్దగా ఇస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని అమెజాన్ కి ఇచ్చేశాం. ఇక మా పని అయిపోయిందని టీమ్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా చేతులెత్తేసారని గుసగుసలు వేడెక్కిపోతున్నాయ్.
థియేటర్లు ఓపెన్ అయితే ఓ మీడియం బడ్జెట్ చిత్రానికే ప్రమోషన్ కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఓపెనింగ్స్.. వారాంతపు వసూళ్లు పొందాలంటే ప్రమోషన్ తప్పనిసరి. కానీ `నిశ్శబ్దం` టీమ్ మాత్రం తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుగా ఓటీటీకి ఇచ్చేశాం అని చేతులు దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇక డిజిటల్ రిలీజ్ వల్ల ప్రచారం ఖర్చులేవీ లేకుండా అవి అయినా మినహాయించుకోవడమే సరైన విధానం అనే మైండ్ సెట్ ప్రమాదకరమేనన్న అంచనా కూడా వెలువడుతోంది.
ఈ మూవీకి ముందు నాని- సుధీర్బాబు నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వి` మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ ని భుజాలకి ఎత్తుకున్న నాని- సుధీర్బాబు- నివేదా థామస్ తమ వంతు పబ్లిసిటీకి కృషి చేశారు. కానీ `నిశ్శబ్దం` టీమ్ మాత్రం ఇలాంటివి ఏమీ చేయడం లేదు. పైగా గూగుల్ ప్రకటనలు కూడా పెద్దగా ఇస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని అమెజాన్ కి ఇచ్చేశాం. ఇక మా పని అయిపోయిందని టీమ్ తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా చేతులెత్తేసారని గుసగుసలు వేడెక్కిపోతున్నాయ్.
థియేటర్లు ఓపెన్ అయితే ఓ మీడియం బడ్జెట్ చిత్రానికే ప్రమోషన్ కోసం దాదాపు 2 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఓపెనింగ్స్.. వారాంతపు వసూళ్లు పొందాలంటే ప్రమోషన్ తప్పనిసరి. కానీ `నిశ్శబ్దం` టీమ్ మాత్రం తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుగా ఓటీటీకి ఇచ్చేశాం అని చేతులు దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇక డిజిటల్ రిలీజ్ వల్ల ప్రచారం ఖర్చులేవీ లేకుండా అవి అయినా మినహాయించుకోవడమే సరైన విధానం అనే మైండ్ సెట్ ప్రమాదకరమేనన్న అంచనా కూడా వెలువడుతోంది.