Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాట బ్రేక్స్‌ లేని బండిలా..!

By:  Tupaki Desk   |   15 Sep 2021 9:30 AM GMT
సర్కారు వారి పాట బ్రేక్స్‌ లేని బండిలా..!
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రం మొదలు పెట్టి చాలా నెలలు అయినా కూడా కరోనా వల్ల అప్పుడింత అప్పుడింత అన్నట్లుగా షూటింగ్‌ చేస్తున్నారు. చిత్రీకరణ ఎప్పటికి ముగుస్తుందో తెలియకుండానే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది ఆరంభంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్న మహేష్‌ బాబు షూటింగ్‌ ను చాలా స్పీడ్‌ గా ముగించేందుకు వర్కౌట్స్ చేస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పాటు ఇప్పటికే త్రివిక్రమ్‌ కు డేట్లు ఇచ్చిన కారణంగా మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రీకరణ విషయంలో స్పీడ్ పెంచాల్సిందిగా కొన్ని వారాల క్రితమే దర్శకుడు పరశురామ్ కు తెలియజేయడం జరిగింది. దాంతో ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ లు లేని బండి మాదిరిగా దూసుకు పోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్ నెలలో ముగించబోతున్నారు. చిత్రీకరణ కోసం గత కొన్ని వారాలుగా మహేష్ బాబు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు విరామం లేకుండా వర్క్ చేస్తున్నారు. అందుకే వచ్చే నెలలో ఖచ్చితంగా గుమ్మడి కాయ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నా కూడా కొన్ని సంఘటనల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాల్సిన ఈ సినిమా ను నవంబర్ వరకే రెడీ చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్‌ నుండే ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట చిత్రీకరణకు మరి కొన్ని రోజుల్లోనే గుమ్మడి కాయ కొట్టడం కన్ఫర్మ్‌ అయ్యింది.

సరిలేరు నీకెవ్వరు వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్‌ బాబు గత ఏడాది సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా తో రాలేదు. కరోనా వల్ల రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన మహేష్‌ బాబు మరో సక్సెస్ ను సర్కారు వారి పాట సినిమాతో దక్కించుకుంటాడేమో చూడాలి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సర్కారు వారి పాట లో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాల గురించి చూపించబోతున్నారు. సర్కారు వారి పాటకు గుమ్మడి కాయ కొట్టడమే ఆలస్యం వెంటనే అతడే పార్థు సినిమాకు త్రివిక్రమ్‌ తో కలిసి మహేష్‌ బాబు కొబ్బరికాయ కొట్టబోతున్నాడు. త్రివిక్రమ్‌ తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమాకు జక్కన్న దర్శకత్వం వహించబోతున్నాడు. మహేష్‌ బాబు రాజమౌళిల కాంబోలో మూవీని 2023 లో పట్టాలెక్కించేలా ప్లాన్‌ చేస్తున్నారు.