Begin typing your search above and press return to search.

భయపడుతు చేయడం అవసరమా బాబు?

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:15 AM GMT
భయపడుతు చేయడం అవసరమా బాబు?
X
నితిన్‌ నేడు భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది మొత్తంలో ఒక్క సినిమాను కూడా విడుదల చేయని నితిన్‌ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలను ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్‌ చాలా బిజీగా ఉన్నాడు. చంద్రశేఖర్‌ యేలేటి.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్న నితిన్‌ పవర్‌ పేట అనే భారీ చిత్రానికి కూడా ఓకే చెప్పాడు. తాజాగా అంధాదున్‌ రీమేక్‌ కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా ప్రకటించాడు.

హిందీ హిట్‌ మూవీ అంధాదున్‌ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ను నితిన్‌ హోం బ్యానర్‌ దక్కించుకుంది. గత ఏడాదే ఈ రీమేక్‌ గురించి వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు నోరు మెదపని నితిన్‌ భీష్మ విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో ఆ రీమేక్‌ పై క్లారిటీ ఇచ్చాడు. అంధాదున్‌ చిత్రంలో నటించాలంటే కాస్త టెన్షన్‌ గా ఉంది. అదో క్లాసిక్‌ మూవీ. అలాంటి సినిమాను రీ క్రియేట్‌ చేయగలమా.. మళ్లీ అలాంటి నటన చూపించగలమా అనే భయం నాలో ఉంది. అయినా కూడా ఇతరుల సలహాలు మరియు ఏదో నమ్మకంతో సినిమాను రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా నితిన్‌ చెప్పుకొచ్చాడు.

సినిమా ఏదైనా కూడా నమ్మకంతో చేయాలి.. పాత్ర ఏదైనా నేను చేయగలను అనే నమ్మకం ఉన్నప్పుడే రంగంలోకి దిగాలి. మరి నితిన్‌ చేయగలనా లేదా అనే అపనమ్మకంతో ఎందుకు రంగంలోకి దిగడం అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అనుమానంతో సినిమాను చేయడం అక్కర్లేదని నెటిజన్స్‌ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై పూర్తిగా నమ్మకం పెట్టి రీమేక్‌ కోసం కష్టపడతాను అనుకున్నప్పుడు రంగంలోకి దిగాలంటూ నితిన్‌ కు సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.