Begin typing your search above and press return to search.

ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకెళ్లనున్న నిఖిల్..!

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 AM GMT
ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకెళ్లనున్న నిఖిల్..!
X
'అర్జున్ సురవరం' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్.. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో సూపర్ నేచురల్ మిస్టికల్ థ్రిల్లర్ ''కార్తికేయ 2'' ఒకటి.

నిఖిల్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'కార్తికేయ' (2014) చిత్రానికి సీక్వెల్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవల మళ్లీ వర్క్ లోకి వచ్చిన హీరో నిఖిల్.. తాజాగా 'కార్తికేయ 2' డబ్బింగ్ ఫార్మాలిటీస్ ని ముగించాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా స్టూడియోలో నిఖిల్ డబ్బింగ్ చెబుతున్న ఓ పిక్ ని కూడా షేర్ చేశారు.

''కార్తికేయ 2'' చిత్రాన్ని 2022 జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

'కార్తికేయ' కు మించి అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాత. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచీ ఎప్పటికప్పుడు విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్న నిఖిల్.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత చందు మొండేటి తో కలిసి ''కార్తికేయ 2'' వంటి మిస్టికల్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. భారీ అంచనాలు నెలకొన్న ఈ సీక్వెల్ మూవీ యువ హీరోకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.