Begin typing your search above and press return to search.

విఘ్నేష్ ని కాదు చెట్టును పెళ్లాడుతున్న న‌య‌న్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2021 11:30 PM GMT
విఘ్నేష్ ని కాదు చెట్టును పెళ్లాడుతున్న న‌య‌న్‌!
X
న‌య‌నతార‌-విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఇన్నాళ్టికి ఈ జంట‌ పెళ్లి బంధంతో ఒక‌ట‌వ్వ‌డానికి రెడీ అవుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. పెద్ద‌ల స‌మక్షంలో మూడుముళ్ల‌తో కొత్త‌ జీవితంలోకి అడుగు పెట్టాల‌ని ఈ జంట ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. న‌య‌న్ క్రిస్టియ‌న్ మ‌తం నుంచి హిందూ మ‌తంలోకి మారినా కానీ ఇన్నాళ్లు ఆ ఘ‌డియ‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. దీనివ‌ల్ల‌ ర‌క‌ర‌కాల సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. పెళ్లికి అడ్డంకులు ఏమిటీ? అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర సంగ‌తులే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. న‌య‌న‌తార విఘ్నేష్ ని వివాహం చేసుకోవాలంటే చాలా పెద్ద త‌తంగామే చేయాల్సి ఉంద‌ని తెలుస్తోంది. న‌య‌న‌తార పుట్టుక దోషాల‌తో ముడిప‌డి ఉంద‌ని.. ముందుగా ఆమె ఆ దోషాలకి త‌గ్గ ప‌రిహారం చేసిన త‌ర్వాత వివాహం చేసుకుంటే మంచిద‌ని..లేదంటే భ‌ర్త‌కు అన్నీ క‌ష్టాలే ఉంటాయ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో న‌య‌న్ అవ‌స‌ర‌మైన అన్ని ఘ‌ట్టాల్ని పూర్తిచేసే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ముందుగా విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవాలంటే అంత‌కంటే ముందే ఆమె ఓ చెట్టును వివాహం చేసుకోవాల‌ట‌. అప్పుడే ఆ దోషం తొల‌గిపోతుంద‌ని వేద పండితులు చెబుతున్నారు. ఇది పురాత‌న ఆచారంలో ఓ భాగమ‌ని అంటున్నారు. జ్యోతిష్యుల సూచ‌న మేర‌కు న‌య‌న్ చెట్టును వివాహం చేసుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈ తంతు పూర్తిచేసిన త‌ర్వాత మూడు నాలుగు నెల‌ల్లోనే న‌య‌న్ వివాహం జ‌రుగుతుంద‌ని స‌మాచారం. న‌య‌న‌తార - ప్ర‌భుదేవా జంట ప్రేమాయ‌ణం కూడా ఇంత‌కుముందు పెళ్లి పీట‌ల వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ఐశ్వ‌ర్యారాయ్ అభిషేక్ బ‌చ్చ‌న్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు. ఐష్ దోష నివార‌ణ పూజ‌ల్లో పాల్గొన్నారు. ఐశ్వ‌ర్యారాయ్ జ‌న‌నం కూడా దోషాల‌తో కూడుకున్న‌ది కావ‌డంతో ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది.

అభిషేక్ తో కాపురం స‌జావుగా సాగాలంటే ఇలాంటి ఆచారం తప్ప‌ద‌ని జ్యోతిష్యులు సూచించ‌డంతోనే ఐష్ స‌నాత‌న సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించారు. అయితే ఇలా చెట్టు పుట్ట‌ను వివాహం చేసుకోవ‌డం ప‌ట్ల ఐష్ పై అప్ప‌ట్లో కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఆధునిక వాదుల నుంచి నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. కానీ వాటిని ప‌ట్టించుకోకుండా భ‌ర్త క్షేమం కోసం ఐష్ చేయాల్సిన‌వ‌న్ని ఎంతో ఓర్పుతో చేసింది. ఇప్పుడు న‌య‌న‌తార కూడా దానినే అనుస‌రిస్తోంది.