Begin typing your search above and press return to search.

పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నరేష్ - పవిత్ర లోకేష్..!

By:  Tupaki Desk   |   1 July 2022 4:45 PM GMT
పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన నరేష్ - పవిత్ర లోకేష్..!
X
గత కొన్ని రోజులుగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు నరేష్ - నటి పవిత్రా లోకేష్ మధ్య సంబంధం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకున్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో నరేష్ తో పెళ్లి వార్తలపై పవిత్ర స్పందించారు.

పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. ''నేను కన్నడ ఇండస్ట్రీకి చెందినదాన్ని అయినప్పటికీ చాలా ఏళ్ళుగా తెలుగు సినిమాలు చేస్తున్నాను. తెలుగు వారికి చాలా దగ్గరయ్యాను. నరేష్ గారి గురించి మీకందరికీ తెలుగు. నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయన ఫ్యామిలీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు''

''అయితే బెంగుళూరులో నరేష్ గారి వైఫ్ అని వచ్చి నా గురించి కన్నడ మీడియాలో చెడ్డగా మాట్లాడింది. మనం రిలేషన్ షిప్ లో ఉన్నాం.. పెళ్లి చేసుకుందాం.. డివోర్స్ తీసుకోమని నేను చెప్పినట్లుగా.. వారిద్దరి విడాకులకు కారణం నేనే అనే విధంగా నన్ను టార్గెట్ చేసి మాట్లాడింది. ఈ మాటలు నన్ను చాలా బాధపెడుతున్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుందనిపించింది. ఆ తరువాత నరేష్ గారు బెంగుళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు''

''ఇప్పుడు నాకు ఈ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేదని పబ్లిక్ చెప్పాలనే సిట్యుయేషన్ వచ్చేసింది. భర్త కావాలంటే ఫ్యామిలీతోనే కూర్చొని సెటిల్ చేసుకోవాలి. నరేష్ గారు తెలుగులో ఫేమస్ యాక్టర్. కానీ రమ్య బెంగుళూరులో ఎందుకు మాట్లాడుతుంది?. హైదరాబాద్ లో కదా మాట్లాడాల్సింది. అక్కడ పెద్దవాళ్లు ఉన్నారు కాబట్టి వాళ్లతో మాట్లాడితే సెటిల్ చేస్తారు. కానీ బెంగుళూరు వచ్చి నన్ను బ్యాడ్ గా ప్రెజంట్ చేసింది. ఇది కరెక్ట్ కాదు. ఈ విషయంలో నన్ను, నరేష్ గారిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని పవిత్ర చెప్పుకొచ్చింది.

అంతకుముందు కన్నడ మీడియాలో మాట్లాడుతూ.. ‘నరేష్ ఫ్యూర్ జెంటిల్ మ్యాన్‘ అని పేర్కొంది పవిత్ర. తమ జీవితంలో జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకుంటామని.. తమ మధ్య ఎలాంటి దాపరికాలు లేవని అన్నారు. ఆయన వ్యక్తిగత విషయాలు ఆయనే చూసుకుంటున్నారని.. తన విషయాలు తానే చూసుకుంటున్నానని.. ఈ విషయంలో ఇద్దరికీ క్లారిటీ ఉందని పవిత్ర చెప్పుకొచ్చారు.

ఇకపోతే నరేష్ తో తన వైవాహిక బంధం ఇంకా తెగిపోలేదని.. తాను ఇంకా విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని రమ్య రఘుపతి చెప్పింది. ఇప్పటికీ తాను నరేష్ భార్యనే అని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. ఈ నేపథ్యంలో రమ్య ఆరోపణలలై పవిత్ర తో పెళ్లికి సంబంధించిన వార్తలపై నరేష్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ రమ్య రఘుపతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

రమ్య రఘుపతి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని.. బెంగళూర్ లోని బ్లాక్ మెయిల్ ఛానల్ తో కలసి తనపై వదంతులు సృష్టిస్తుందని నరేష్ అన్నారు. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ఆమె పవిత్ర లోకేష్ కు తనకు ఏదో సంబంధం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేస్తుందన్నారు. డబ్బు కోసమే రమ్య బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టిందని పేర్కొన్న నరేష్ హైదరాబాద్ లో కూడా గతంలో ఇలాగే చేసిందని ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యవహారం మొదలుపెట్టిందని తెలిపారు. ఈ విషయం మీద అలెర్ట్ చేయడానికి తాను బెంగళూరు వచ్చానని చెప్పారు.

రమ్య రఘుపతికి ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నానని.. 50 లక్షల కోసం ఇంట్లో వాళ్ళని పీడించిందని నరేష్ అన్నారు. ఇన్ని క్రైమ్స్ చేసిన తరువాత కూడా డబ్బు అడిగితే ఒక పది లక్షలు ఇచ్చానని.. ఆమె చేసిన పనికి అందరూ ఇంటి మీద పడి గొడవ చేస్తుంటే డివోర్స్ పంపించానని తెలిపారు. ఎప్పుడైతే విడాకుల నోటీసులు పంపించానో.. అప్పటినుంచి నాకు వేరే పెళ్లి జరగబోతుందని వార్తలు సృష్టించిందని నరేష్ పేర్కొన్నారు.

''నేను ఎనిమిదేళ్లుగా పడ్డ హింస, బ్లాక్ మెయిల్, జనాలను మోసం చేయడం నాకు చాలా అవమానంగా ఉంది. అందుకే నేను డివోర్స్ తీసుకుంటున్నాను. ఈ విషయానికి పవిత్ర లోకేష్ ని లింక్ చేసి ఆమె కోసం డివోర్స్ తీసుకుంటున్నానని కొత్త యాంగిల్ తీసుకురావడం చాలా తప్పు. మా రిలేషన్షిప్, మా ఫ్రెండ్షిప్ మాది. మేమెప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తేనే భయపడాలి. దెయ్యాలకు భయపడం'' అని నరేశ్ చెప్పుకొచ్చారు.