Begin typing your search above and press return to search.

'మహాసముద్రం'లో నాని హీరోయిన్...?

By:  Tupaki Desk   |   19 Sep 2020 8:30 AM GMT
మహాసముద్రంలో నాని హీరోయిన్...?
X
'Rx 100' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. రెండేళ్ల గ్యాప్ తీసుకొని ''మహాసముద్రం'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో యువ హీరో శర్వానంద్ మరియు 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ హీరోలుగా నటించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరోయిన్స్ ఎవరనే దానిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంకా మోహన్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించనుందనే వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

కాగా, 'ఒందు కథే హల్లా' అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక అరుళ్ మోహన్.. నాని - విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీలో తన అందచందాలతో యూత్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'శ్రీకారం' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ప్రియాంకా. ఈ క్రమంలో మరోసారి శర్వానంద్ తో జోడీ కట్టడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. 'మహాసముద్రం' సినిమాలో శర్వా కి జోడీగా ప్రియాంక నటించనుందట. మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం.