Begin typing your search above and press return to search.

సాయిధరమ్ తేజ్ బైక్ చాలన్ క్లియర్ చేసిన నందమూరి అభిమాని

By:  Tupaki Desk   |   12 Sep 2021 2:30 PM GMT
సాయిధరమ్ తేజ్ బైక్ చాలన్ క్లియర్ చేసిన నందమూరి అభిమాని
X
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడి అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే యాక్సిడెంట్ కు కారణమైన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయితేజ్ మీద కేసు కూడా నమోదు చేశారు.

ప్రమాదం జరిగినప్పుడు సాయి ధరమ్ తేజ్ నడుపుతున్న బైక్‌ పై ఇదివరకే అతివేగంపై ఒక పెండింగ్ చలాన్ ఉందని పోలీసులు ఇప్పటికే తెలిపారు. ప్రమాదం తర్వాత చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ తర్వాత క్లియర్ అయింది.

మాదాపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్ కుమార్ బురా అనే వ్యక్తి నుంచి సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. కొనుగోలు చేసిన తర్వాత సాయి ధరమ్ తేజ్ బైక్ తన పేరుకు మార్చుకోలేదని తెలిపారు..

యాక్సిడెంట్ తర్వాత ఆ బైక్ పై ఒక పెండింగ్ చలాన్ ఉందన్న విషయం వైరల్ అయ్యింది. ఇంతలో సాయి ధరమ్ తేజ్ అభిమాని పెండింగ్‌లో ఉన్న చలాన్‌ను క్లియర్ చేసినట్లు కూడా డీసీపీ వెల్లడించారు. నటుడి బైక్ పై పెండింగ్‌లో ఉన్న ఓవర్ స్పీడింగ్ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు.. ఓ ఎన్టీఆర్ అభిమాని దీన్ని క్లియర్ చేశాడని తెలిసింది.

కాగా సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్సకు బాగా స్పందిస్తున్నారు. ఈరోజు తర్వాత అతనికి కాలర్ బోన్ సర్జరీ కూడా చేశారు.