Begin typing your search above and press return to search.

ఫ‌లించిన న‌మ్ర‌త‌ మ‌హేష్ క్యాంప్ వ్యూహం

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:50 AM GMT
ఫ‌లించిన న‌మ్ర‌త‌ మ‌హేష్ క్యాంప్ వ్యూహం
X
వాట్సాప్ చాట్ల ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి మాదకద్రవ్యాల దర్యాప్తులో దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్- రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. నమ్రతా శిరోద్కర్ పేరు డ్రగ్ చాట్లలో కనిపించడం గురించి జాతీయ మీడియా ర‌చ్చ చేసింది. అయితే ఆ త‌రువాత ఆమె పేరు మ‌ళ్ళీ వార్త‌ల్లో క‌‌నిపించ‌లేదు. స‌డ‌న్ గా సైలెంట్ అయిపోయింది.

ఈ ఎపిసోడ్ ‌లోకి నమ్రతని పొరపాటున తీసుకువచ్చారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మహేష్ బాబు- నమ్రత త‌మ‌ పేరును ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కోట్ చేసినప్పుడు మౌనం పాటించాలని నిర్ణయించుకున్నార‌ట‌. తెలుగు మీడియా ప్రస్తావించినప్పటికీ వారు స్పందించలేదు. ఈ ఎపిసోడ్లో మౌనంగానే వుండాల‌నుకున్నార‌ట‌. ఆ ప్యూహ‌మే ఇప్పుడు ఫ‌లించింద‌ని చెబుతున్నారు.

అలా మౌనంగా వుండ‌టం వ‌ల్లే నమ్రత పేరును ఎన్‌.సి.బి లేదా జాతీయ మీడియా కూడా చర్చించలేదు. ఈ వ్యూహంలో నమ్రతా.. మహేష్ వెనుక ఎవరున్నారు? అలాంటి మాయాజాలాన్ని ఎలా చేయ‌గ‌లిగారు? అన్న‌ది మాత్రం ఇప్పుడు టాలీవుడ్ ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక తొంద‌ర‌ప‌డి త‌మ‌పై చేస్తున్న ప్ర‌చారం అంతా అస‌త్య ప్ర‌చార‌మ‌ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఖండించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌పై బుర‌ద జ‌ల్లాల‌నే ఎవ‌రో ఇది చేస్తున్నార‌ని న‌మ్ర‌త టీమ్ మాత్రం స్పందించింది అప్ప‌ట్లో. ఆ త‌ర్వాత ఇక నేరుగా సీన్ లోకి అయితే వారు ఎవ‌రూ రాలేదు.