Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ లో అస‌త్య ప్ర‌చారం.. మాపై బుర‌ద చ‌ల్లుతున్నారు!- న‌మ్ర‌త టీమ్‌

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:00 PM GMT
డ్ర‌గ్స్ లో అస‌త్య ప్ర‌చారం.. మాపై బుర‌ద చ‌ల్లుతున్నారు!- న‌మ్ర‌త టీమ్‌
X
బాలీవుడ్ డ్ర‌గ్స్ లింకులో ప‌లువురు టాలీవుడ్ క‌థానాయిక‌ల పేర్లు జాతీయ మీడియా హెడ్ లైన్స్ లోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ కు డ్ర‌గ్స్ తో లింకు ఉందంటూ జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజ‌ర్ జ‌యా సాహాతో డ్ర‌గ్స్ కు సంబంధించి న‌మ్ర‌త చాట్ చేశార‌ని ఎన్.సి.బి విచార‌ణ‌లో తేలింద‌ని నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాల్ని వేడెక్కిస్తోంది. ``బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం`` అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇది నిజ‌మా? అన్న ప్ర‌శ్న‌కు.. స‌సేమిరా అంటూ న‌మ్ర‌త టీమ్ ఖండించింది.

ప్ర‌స్తుతం న‌మ్ర‌త ముంబైలోనే ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే ఇదంతా అస‌త్య ప్ర‌చార‌మ‌ని.. త‌మ‌పై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్న‌మేన‌ని న‌మ్ర‌త టీమ్ ఖండించింది. డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్టు వ‌స్తున్న క‌థ‌నాల్లో త‌మ పేరును అన‌వ‌స‌రంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని న‌మ్ర‌త టీమ్ ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌డం హీట్ పెంచుతోంది. అయితే ఎన్.సి.బి విచార‌ణ‌లో జ‌య సాహాతో చాట్ లో `ఎన్` అనే అక్ష‌రం ఉన్న‌ట్టు వెల్ల‌డించార‌ని ఆ పేరు న‌మ్ర‌త‌నే అన్న క‌థ‌నాల్ని జాతీయ మీడియాలు ప‌దే ప‌దే రిపీట్ చేస్తుండ‌డంతో అది కాస్తా వైర‌ల్ గా మారింది.

ఇక న‌మ్ర‌త శిరోద్క‌ర్ కి టాలీవుడ్ స‌హా బాలీవుడ్ సినీవ‌ర్గాల్లో ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాలున్నాయి. జ‌య సాహాతో కేవ‌లం స్నేహం మాత్ర‌మేనా జాతీయ మీడియా క‌థ‌నాలు చెబుతున్న‌ట్టు ఇంకేదైనా త‌ప్పు జరిగిందా? అన్న‌దానిపై నార్కోటిక్స్ విచార‌ణ లో నిగ్గు తేలాల్సి ఉంటుంది. అస‌లు `ఎన్` అనే పేరు ఎవ‌రిది? అన్న‌ది విచార‌ణ‌లో తేలాల్సి ఉంది. ఇప్ప‌టికే ఎన్.సి.బి విచార‌ణ‌లో ర‌కుల్ ప్రీత్ .. దియా మీర్జా వంటి పేర్లు వెలుగు చూసాయ‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు హీటెక్కించాయి. ఇప్పుడు న‌మ్ర‌త పేరు వినిపించ‌డం అభిమానుల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మైంది.