Begin typing your search above and press return to search.

'మీరు ఏ విధంగా చూసినా అది ప్రేమ మాత్రమే'

By:  Tupaki Desk   |   9 July 2020 3:56 PM GMT
మీరు ఏ విధంగా చూసినా అది ప్రేమ మాత్రమే
X
సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ షూటింగ్ లకు బ్రేక్ పడటంతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మాములుగా మహేష్ బాబు ఏ మాత్రం సమయం దొరికినా భార్యాపిల్లతో టూర్స్ వేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తుంటారు. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ తో కావాల్సినంత సమయం దొరకడంతో తన పిల్లలు గౌతమ్ కృష్ణ - సితార పాపలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అదే సమయంలో బయటకి వెళ్లే పరిస్థితులు కూడా లేకపోవడంతో పుస్తకాలు చదువుతూ.. వెబ్ సిరీస్ లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు మహేష్. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డైలీ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. మరోవైపు ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటున్నారు.

ఇక మహేష్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ - సితారల ఫోటోలను షేర్ చేయడంతో పాటు మహేష్ కి సంబందించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు తన పెట్ డాగ్ తో కలిసి ఆడుకుంటున్న ఓ పిక్ షేర్ చేశారు. దీనికి "మీరు ఏ విధంగా చూసినా అది ప్రేమ మాత్రమే" అనే క్యాప్షన్ పెట్టారు నమ్రత. మహేష్ ఈ ఫొటోలో తన పెట్ డాగ్ ని ఆప్యాయంగా కౌగిలించుకొని ఉన్నారు. మహేష్ తన పెట్ డాగ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారని తెలుస్తోంది. ఇంతకముందు కూడా నా బిగ్ బాయ్ కి తొమ్మిదేళ్లు వచ్చాయంటూ మహేష్ తన పెట్ పట్ల ప్రేమను వెల్లడించారు. ప్రస్తుతం నమ్రత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.