Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ్యామిలీకి గణపతి బప్ప ఆశీస్స‌లు

By:  Tupaki Desk   |   15 Sep 2021 8:33 AM GMT
మ‌హేష్ ఫ్యామిలీకి గణపతి బప్ప ఆశీస్స‌లు
X
సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం అభిమానుల‌కు వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల‌ను చేర‌వేస్తూ న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి స‌రైన టైమ్ వ‌చ్చింది. తన ఇన్ స్టా లో తాజాగా తన భర్త మహేష్ బాబు- పిల్లలు సితార - గౌతమ్ తో కలిసి గణేష్ చతుర్థి వేడుకల వీడియోను పంచుకున్నారు. వీడియోలో కుటుంబమంతా గణపతి బప్ప ఆశీర్వాదం అందుకుంటున్న వైనం క‌నిపిస్తోంది. స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడానికి వారు పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాన్ని ఎంచుకున్నారు.

గోవాలో సర్కారు వారి పాట చిత్రీకరణకు తన భర్త మహేష్ బాబుతో కలిసి వచ్చిన నమ్రత శిరోద్కర్ తన కుటుంబంతో తన గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన వీడియోలు పంచుకోవ‌డం ఆస‌క్తిక‌రం. వీడియోను షేర్ చేస్తూ నమ్రత ఇలా రాసారు. ``ఎప్పుడూ వీడ్కోలు చెప్పవద్దు .. అతని ఆశీస్సులు మా కుటుంబంపై కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఏడాది త్వరలో మీరు ఇంటికి వస్తారని ఆశిస్తున్నాను!`` అని వ్యాఖ్య‌ను జోడించారు.

మహేష్ బాబు సినిమా షార్ట్ షెడ్యూల్ కోసం తన కుటుంబంతో గోవాకు బయలుదేరార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. పరశురామ్ పెట్ల దర్శకత్వం లో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. గోవాలో కొన్ని టాకీ పార్ట్ లు స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరించ‌నున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

గోవాలో న‌మ్ర‌త చిలౌట్ ఆస‌క్తిక‌రం. ఇసుక లో ఆట‌లాడుతూ.. సముద్రాన్ని ఆస్వాధించే కుటుంబం ఫోటోల‌ను పంచుకుంటూ.. నమ్రత ఇలా పోయెట్రీని రాసారు. సూర్యుడు.. సముద్రం .. సర్ఫ్ దేశానికి వెళ్లండి! #GoaCalling #BonVoyage (sic)`` అని వ్యాఖ్యానించారు. సర్కారు వారి పాట సంక్రాంతి 2022 న బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ రాధే శ్యామ్ - పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ల‌తో ఢీకొంటుంది.