Begin typing your search above and press return to search.

దుబాయ్ లో నమ్రత బర్త్ డే.. పిక్స్ వైరల్!

By:  Tupaki Desk   |   23 Jan 2021 8:13 AM GMT
దుబాయ్ లో నమ్రత బర్త్ డే.. పిక్స్ వైరల్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఏ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పొచ్చు. తన హెక్టిక్ షెడ్యూల్లోనూ కుటుంబానికి విలువైన సమయాన్ని కేటాయిస్తుంటాడు. కెరీర్ ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడో.. ఫ్యామిలీ విషయంలో అంతకు మించిన కేర్ చూపిస్తుంటాడు.

తాజాగా.. తన సతీమణి నమత్ర శిరోద్కర్ కు దుబాయ్ లో బర్త్ డే విశెష్ చెప్పాడు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ నాలుగు గోడలకే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే రెక్కలు కట్టుకొని వివాహారానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బెటర్ హాఫ్ బర్త్ డే పార్టీని అరబ్ కంట్రీలో ప్లాన్ చేశాడు ప్రిన్స్.

జనవరి 22 నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో పిల్లలు గౌతమ్, సీతారతోపాటు నమ్రత అక్క శిల్పా శిరోద్కర్, మరికొందరు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను నమత్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

ఇక, సినిమాల విషయానికి వస్తే.. మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్
ప్రీ లుక్ కి మంచి ఆదరణ లభించడంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కాగా.. ఈ చిత్రం షూటింగ్ సైతం దుబాయ్ లో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అదే.. నిజమైతే మహేష్ కి కలిసి వచ్చే అంశమే. ఇక అక్కడే షెడ్యూల్ ఫినిష్ అయ్యే వరకు ఉండొచ్చు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.