Begin typing your search above and press return to search.

కోటితో కదిలొచ్చిన కింగ్ నాగార్జున..

By:  Tupaki Desk   |   28 March 2020 3:14 PM GMT
కోటితో కదిలొచ్చిన కింగ్ నాగార్జున..
X
అక్కినేని నాగార్జున కింగ్ నాగార్జునగా ఊరికే కాలేదు. హీరోగా ఎదగడానికి ఎన్నో కష్టాలను - నష్టాలను భరించి ఈరోజు ఇంతటి స్టార్ అయ్యాడు. ప్రస్తుతం కరోనా బారిన దేశ విదేశాల ప్రజలు మగ్గిపోతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్నది పేదలు మాత్రమే. దినసరి కూలి పని చేసుకునేవారు వారి రోజువారీ జీవితాన్ని సాగించలేక పోతున్నారు. అందులో ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లు ఉన్నారు. కరోనా వల్ల ఇళ్లకే పరిమితమైన సినీ వర్కర్స్ రోజు ఫుడ్ కోసం తిప్పలు పడుతున్నారు. వీళ్ళ కష్టాలకు టాలీవుడ్ లో సినీ ప్రముఖులు ఇప్పటికే విరాళాలు అందిస్తున్నారు.

ఇప్పటికే సురేష్ బాబు - ప్రభాస్ - అల్లు అర్జున్ - మహేష్ బాబు లాంటి స్టార్స్ అంతా కరోనా నివారణ కోసం సహాయం చేసారు. సినిమా కూలీల కోసం కూడా టాలీవుడ్ దర్శకులు - నిర్మాతలు - హీరోలు విరాళాలు అందిస్తున్నారు. ఇక రీసెంట్ గా అక్కినేని నాగచైతన్య కూడా 25లక్షల విరాళం అందించాడు. తాజాగా ఇప్పుడు అక్కినేని నాగార్జున కదిలి వచ్చాడు. సినీ వర్కర్స్ కోసం కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా ఒక్కొక్క సెలబ్రిటీ కదిలొచ్చి ఫండ్స్ ఇస్తుంటే సినీ వర్కర్స్ కి కాస్త ఊరట లభిస్తుంది. ఇలాంటి కష్టాలొచ్చినప్పుడు కూడా సినిమా వాళ్లు ఆదుకోకపోతే ఎలా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి నాగార్జున స్పందించడంతో సోషల్ మీడియాలో బజ్ ఏర్పడింది. నాగార్జున సినిమాలలోనే కాదు సహాయంలో కూడా కింగే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.