Begin typing your search above and press return to search.

నాగబాబు సోషల్ మీడియా ఫాలో అప్ పెంచుకోడానికి ట్రై చేస్తున్నాడా...?

By:  Tupaki Desk   |   30 May 2020 11:30 PM GMT
నాగబాబు సోషల్ మీడియా ఫాలో అప్ పెంచుకోడానికి ట్రై చేస్తున్నాడా...?
X
టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నగా అందరికి సుపరిచితమే. అయితే ఇప్పుడు నాగబాబుకి అన్నాతమ్ముళ్ల వలన గుర్తింపు తప్ప సొంతంగా ఐడెంటిటీ లేదని టీడీపీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు విమర్శిస్తున్నారు. ఇప్పటి దాకా వారి పేరు చెప్పుకొని సినిమాల్లో రాజకీయాల్లో గుర్తింపు పొందుతున్నాడని.. అందుకే ఇప్పుడు లేనిపోని వివాదాలను సృష్టిస్తూ.. బాలయ్యని కామెంట్ చేస్తూ మంచో చెడో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. కాగా మెగా బ్రదర్ నాగబాబు మొన్న హీరో బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే బాలయ్యపై వ్యాఖ్యలు చేసి రెండ్రోజులు కాకముందే నాగబాబు ఇప్పుడు టీడీపీ పార్టీ పైనా ఆ పార్టీ నేతల పైనా ట్వీట్లతో దాడి చేసారు. దీని పై ఇప్పుడు నాగబాబు పై టీడీపీ మరియు నందమూరి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇండస్ట్రీలో హీరోగా నటుడిగా నిర్మాతగా హోస్ట్ గా ఫెయిల్ అయిన నాగబాబు రాజకీయాల్లో కూడా ఫెయిల్ అయ్యాడని.. అందుకే ఇప్పుడు వివాదాస్పద ట్వీట్ల ద్వారా యూట్యూబ్ వీడియోలు ద్వారా అట్టెన్షన్ కోరుకుంటున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటి దాకా చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా మాత్రమే పిలవబడుతున్న నాగబాబు కి సొంతగా ఐడెంటిటీ లేదని.. ఇప్పుడు బాలయ్యపైన టీడీపీ పైన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టి తనవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నదంటూ వీడియోలు రిలీజ్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. 'నా ఛానల్ నా ఇష్టం' అని యూట్యూబ్ ఛానల్ పెట్టి హిట్స్ సాధించ లేకపోయిన నాగబాబు ఇలా బాలయ్యపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిట్స్ తెచ్చుకోవాలని చూస్తున్నాడని.. బాలయ్య లాంటి స్టార్ హీరోని టార్గెట్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదంటూ బాలయ్య అభిమానులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా బాలయ్య మీద కాంట్రవర్సి చేస్తేనే అతని వీడియోస్ కి వ్యూస్ వచ్చాయని.. కేవలం యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ పెంచుకోడానికి నాగబాబు ఇలా చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు బాలయ్య మీద వ్యాఖ్యలు చేసిన వీడియో ట్రెండింగ్ లో ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో టీడీపీ పై నాగబాబు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం టీడీపీపై అసందర్భమైన ట్వీట్స్ పెడుతున్నాడని టీడీపీ అభిమానులు ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకముందు మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని గొప్ప దేశభక్తుడని ట్వీట్ చేసి అందరూ తన గురించి మాట్లాడుకొనేలా ప్లాన్ చేసాడని.. ఇప్పుడు బాలయ్యని టీడీపీని విమర్శించి సోషల్ మీడియా ఫాలో అప్ పెంచుకోడానికి ట్రై చేస్తున్నాడని బాలయ్య అభిమానులు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీవీ షోల ద్వారా తనకు ఉన్న పరిచయాలను బాగా ఉపయోగించుకుని తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్న నాగబాబు వారిని ఇలాంటి తప్పుడు ప్రచారంలో వాడుకుంటూ తనకంటూ సొంత ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నాడని టీడీపీ అభిమానులు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.