Begin typing your search above and press return to search.

ఆ మాట చెప్తే సామ్ దెయ్యంలా మొహం పెట్టింది

By:  Tupaki Desk   |   2 Sep 2018 9:49 AM GMT
ఆ మాట చెప్తే సామ్ దెయ్యంలా మొహం పెట్టింది
X
టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో నాగ చైతన్య - సమంతా జంట ఎప్పుడూ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. రియల్ లైఫ్ లో విడి విడిగా ఉన్నప్పుడు 'ఏ మాయ చేసావె'.. 'మనం'.. 'ఆటో నగర్ సూర్య' సినిమాలతో రీల్ జంటగా మూడుసార్లు చైతూ - సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో జంటగా మారిన తర్వాత మాత్రం వేరే వేరే సినిమాలతో సెప్టెంబర్ 13 న బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నారు.

కానీ అది విడివిడిగా రావడం కాదట. కలిసి వచ్చినట్టేనట. సినిమాలు వేరే అయినా కపుల్ గా కలిసి ప్రమోషన్ చేస్తామని అంటున్నారు. చైతు "నా సినిమాను నువ్వు.. నీ సినిమాను నేను ప్రమోట్ చేద్దాం" అని ఇద్దరమూ అనుకున్నామని రీసెంట్ ఇంటర్వ్యూ లో తెలిపాడు. నిజానికి సమంత సినిమాకు మొదట సెప్టెంబర్ 13 డేట్ ను లాక్ చేసినా చైతు సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' అనివార్యకారణాల వల్ల వాయిదా పడి అదే డేట్ కు ఫిక్స్ అయింది. ఈ విషయం మొదట తెలిసినప్పుడు సమంత రియాక్షన్ ఏంటని చైతును అడిగితే "ఫస్ట్ టైమ్ సోలో హీరోయిన్‌గా నేనొక సినిమా చేస్తున్నా. నువ్వు వచ్చి నా మీద పడతావా? అని 'యూ టర్న్' లో దెయ్యంలా మొహం పెట్టింది" అన్నాడు. వినాయక చవితి పండగ.. పైగా రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ కాబట్టి ఇద్దరినీ ప్రేక్షకులు ఆదరిస్తారని డిస్ట్రిబ్యూటర్లు ధైర్యం చెప్పారట.

ఇక చైతు తన అత్తగారి కుటుంబ సభ్యుల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. సమంతా ఫ్యామిలీ సినిమాలకు చాలా దూరంగా ఉంటుందని తెలిపాడు. అందుకే సమంత కొత్త సినిమా వస్తుందంటే సమంతా పేరెంట్స్ కు "మీ అమ్మాయి నటించిన సినిమా విడుదల అవుతోంది చూడండి" అని మెసేజ్ పెడతాడట. అంతే కాదు సమంతాకు ఇద్దరు బ్రదర్స్.. ఒకరు అమెరికాలో ఉంటే మరొకరు చెన్నైలో ఉన్నారట. వాళ్ళు కూడా సినిమాలకు దూరంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. చెన్నైకి వెళ్ళినప్పుడు అత్తామామలను కలుస్తుంటానని చెప్పాడు ఈ అక్కినేని హీరో.