Begin typing your search above and press return to search.

మాయావితో రామారావు భేటీ.. విభేధాలు లేన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   21 May 2022 4:35 AM GMT
మాయావితో రామారావు భేటీ.. విభేధాలు లేన‌ట్టేనా?
X
ప‌రిశ్ర‌మ‌లో స్నేహాలు ఎంతో గొప్ప‌వి. విభేధాలు ఉన్నా వాటిని ప‌రిష్క‌రించుకుని తిరిగి క‌లిసిపోయేంత మాన‌సిక ప‌రిప‌క్వ‌త ఉంటుంది. స‌హ‌జంగానే స్టోరీ సిట్టింగ్స్ లో బోలెడ‌న్ని విభేధాలు త‌లెత్తుతుంటాయి. ద‌ర్శ‌కుడికి న‌చ్చితే అది హీరోకి న‌చ్చాల‌నేమీ లేదు. హీరోకి ఓకే అయినా అది ద‌ర్శ‌కుడికి క‌నెక్ట‌వుతుందా లేదా చెప్ప‌లేం.

వీరిద్ద‌రి మ‌ధ్యా నిర్మాత ఇన్ పుట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కోట్లాది రూపాయ‌లు వెచ్చించి తీసే భారీ చిత్రాల విష‌యంలో హీరోతో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల సింక్ చాలా అవ‌స‌రం. అది తేడా కొడితే టోట‌ల్ ప్రాజెక్ట్ కొలాప్స్ అవుతుంది.

అందుకే కొన్నిసార్లు ప్రాజెక్ట్ ప్రారంభించాక కూడా బ్రేక‌ప్ అవుతుంటారు. ఇంత‌కుముందు ఆల్మోస్ట్ అలాంటి స‌న్నివేశ‌మే త్రివిక్ర‌మ్ - తార‌క్ మ‌ధ్య త‌లెత్తిందని టాక్ వినిపించింది. ప్రాజెక్ట్ ఇక ముందుకెళ్లిపోవ‌డమేన‌ని అంతా వేచి చూస్తున్న స‌మ‌యంలో మిడిల్ డ్రాప్ అయ్యారు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయని హీరోకి ద‌ర్శ‌కుడికి మ‌ధ్య సింక్ కుద‌ర‌లేదని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే ఇండ‌స్ట్రీలో ఇలాంటివి ప‌ర్మినెంట్ కాదు. టెంప‌ర‌రీ మాత్ర‌మేన‌ని నిరూపిస్తూ ఇప్పుడు తార‌క్ తో త్రివిక్ర‌మ్ క‌లిసిపోయారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల్లో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. ఇది ఆసక్తికర పరిణామం అన్న చ‌ర్చా సాగుతోంది.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తమ ప్రాజెక్ట్ #NTR30 విషయంలో విభేదాల వ‌ల్ల క‌లిసి ప‌ని చేయ‌లేక‌పోయారు. త్రివిక్రమ్ తన 30వ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ త్రివిక్రమ్ కొన్ని నిబంధనలకు అంగీకరించడానికి నిరాకరించ‌డంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాతో బిజీ కాగా.. ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఇటీవల తన పాత స్నేహితుడైన మహేష్ బాబుతో సినిమాకి క‌మిట‌య్యాడు. అత‌డు- ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ తో మూడవసారి కలిసి ప‌ని చేస్తున్నాడు.

ఇక బ‌ర్త్ డే రోజున‌ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలప‌డం ద్వారా త్రివిక్ర‌మ్ త‌మ‌ మధ్య విభేదాలను తొలగించారు. ఇప్పుడు త్రివిక్రమ్- ఎన్టీఆర్ మధ్య అంతా బాగానే ఉందన్న గుస‌గుస వైర‌ల్ అయ్యింది. త‌దుప‌రి ఈ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

ప్ర‌స్తుతం తార‌క్ కొర‌టాల‌తో సినిమా చేస్తూనే ప్ర‌శాంత్ నీల్ సినిమాపై దృష్టి సారించ‌నున్నారు. కేజీఎఫ్ 2 త‌ర్వాత స‌లార్ లాంటి భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ప్ర‌శాంత్ నీల్ త‌దుప‌రి తార‌క్ ని పాన్ ఇండియా హీరోల్లో టాప్ రేంజుకు చేర్చ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేయ‌నున్నారు. తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఎన్టీఆర్ ని ప‌క్కా మాస్ అవ‌తార్ లో క్రూరంగా చూపించ‌బోతున్నాడ‌ని పోస్ట‌ర్ వెల్ల‌డిస్తోంది. అయితే ఎన్టీఆర్ ని పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల న‌డుమ త్రివిక్ర‌మ్ ఎలా చూపించ‌బోతున్నారు? అన్న‌ది కూడా డిబేట్ కి తెర తీస్తుంద‌న‌డంలో సందేహం లేదు.