Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడా...?

By:  Tupaki Desk   |   31 May 2020 12:30 AM GMT
ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ సినిమాని త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు) - నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ గురించి ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అయితే సినిమా మొత్తం తారక్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా లేక ప్లాష్ బ్యాక్ లో సెకెండ్ రోల్ వస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఇంతకముందు 'అదుర్స్' 'ఆంధ్రావాలా' సినిమాల్లో రెండు పాత్రలలో అలరించిన ఎన్టీఆర్ 'జైలవకుశ' సినిమాలో మూడు పాత్రల్లో కనిపించాడు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తారక్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది నవంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులలో ప్లాన్స్ అన్నీ తారుమారు అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.