Begin typing your search above and press return to search.

ధనుష్ మాట.. మొదలైన మైత్రి వేట?

By:  Tupaki Desk   |   8 Aug 2022 11:30 AM GMT
ధనుష్ మాట.. మొదలైన మైత్రి వేట?
X
కాస్త గ్రీన్ సిగ్నల్ వచ్చినా కూడా మైత్రి మూవీ మేకర్స్ అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇటీవల కాలంలో మైత్రి మూవీ మేకర్స్ మరింత స్పీడ్ పెంచింది అని చెప్పాలి.

ఒకవైపు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూనే మరొకవైపు చిన్న బడ్జెట్లో చిన్న హీరోలతో కూడా సినిమాలను కంటిన్యూ చేస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా చాలా వేగంగా వెళుతున్న ఈ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి.

ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో కూడా అతిపెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా బై లాంగ్యువల్ సినిమాలపై కూడా ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నారు. ఇక గత ఏడాది నుంచి ఒక హీరోతో డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల మొత్తానికి గ్రీన్ సిగ్నల్ అందుకుంది.

ఆ హీరో మరెవరో కాదు తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ అని తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం తెలుగు నిర్మాత దర్శకులతో సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నాడు. సీతార ఎంటర్టైన్మెంట్స్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఇప్పటికే సార్ అనే సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా త్వరలోనే ఒక సినిమాను మొదలుపెట్టనున్నాడు.

అయితే మైత్రి మూవీ మేకర్స్ కూడా ధనుష్ షో సినిమా చేయడానికి ప్రస్తుతం కథల వేటను మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు చాలామంది దర్శకుల దగ్గర కథలు విన్న మైత్రి మూవీ మేకర్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెంద లేకపోయిందట.

ధనుష్ దగ్గరికి వెళితే మాత్రం ఫిక్స్ అయ్యేలా ఉండాలి అనే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అని కూడా వారు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ధనుష్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్టును ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి.