Begin typing your search above and press return to search.
సల్మాన్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ని కలుపుతారా?
By: Tupaki Desk | 20 Feb 2020 5:45 AM GMTఅల్లు అర్జున్ హీరోగా ఏఏ 20 సినిమాని నిర్మిస్తోంది మైత్రి సంస్థ. తదుపరి పవన్ కల్యాణ్ - ప్రభాస్ - ఎన్టీఆర్ - చరణ్ లాంటి స్టార్లతో సినిమాలు చేయనుంది. ఓవైపు టాలీవుడ్ అగ్ర హరోలతో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లోనూ లైన్ క్లియర్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి క్రేజీ హీరోతో మైత్రి సంస్థ మూవీ ప్లాన్ చేయడం ఉత్కంఠ పెంచుతోంది.
మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని కలిశారట. అలాగే కలిసి సినిమా చేయాలన్న ఆలోచనను షేర్ చేసుకున్నారు. అందుకు సల్మాన్ పాజిటివ్ గా స్పందించడంతో 10 కోట్ల మేర అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే మైత్రి సంస్థలో సినిమా చేసేందుకు ప్రామిస్ చేశాడట. ఇక సల్మాన్ కి కథ వినిపించి ఓకే చేయించగలిగే దర్శకుడు ఎవరు? అన్నది వెతుకుతున్నారని తెలుస్తోంది.
డి.రామానాయుడు -డి.సురేష్ బాబు- అల్లు అరవింద్ వంటి టాప్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లో సినిమాలు నిర్మించారు. దిల్ రాజు `జెర్సీ` రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ తెలుగు రీమేక్ లాయర్ సాబ్ ని బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు తెలుగులో నిర్మిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ పేరు వెలుగులోకి వచ్చింది. అన్నట్టు సల్మాన్ ని డైరెక్ట్ చేయాలంటే కేజీఎఫ్ డైరెక్టర్ రేంజ్ కావాలేమో! ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మైత్రి సంస్థకు టచ్ లో ఉన్నాడు. ఆయనేమైనా సల్మాన్ భాయ్ కి కథ రెడీ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మైత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ తో కుదిరితే అందు లో నటించడానికి తారక్ ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
మైత్రి నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని కలిశారట. అలాగే కలిసి సినిమా చేయాలన్న ఆలోచనను షేర్ చేసుకున్నారు. అందుకు సల్మాన్ పాజిటివ్ గా స్పందించడంతో 10 కోట్ల మేర అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే మైత్రి సంస్థలో సినిమా చేసేందుకు ప్రామిస్ చేశాడట. ఇక సల్మాన్ కి కథ వినిపించి ఓకే చేయించగలిగే దర్శకుడు ఎవరు? అన్నది వెతుకుతున్నారని తెలుస్తోంది.
డి.రామానాయుడు -డి.సురేష్ బాబు- అల్లు అరవింద్ వంటి టాప్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లో సినిమాలు నిర్మించారు. దిల్ రాజు `జెర్సీ` రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ తెలుగు రీమేక్ లాయర్ సాబ్ ని బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు తెలుగులో నిర్మిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ పేరు వెలుగులోకి వచ్చింది. అన్నట్టు సల్మాన్ ని డైరెక్ట్ చేయాలంటే కేజీఎఫ్ డైరెక్టర్ రేంజ్ కావాలేమో! ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మైత్రి సంస్థకు టచ్ లో ఉన్నాడు. ఆయనేమైనా సల్మాన్ భాయ్ కి కథ రెడీ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మైత్రికి కేజీఎఫ్ డైరెక్టర్ తో కుదిరితే అందు లో నటించడానికి తారక్ ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.