Begin typing your search above and press return to search.

శివ‌రాత్రికి మూవీ ట్రాఫిక్ జామ్.. బ‌రిలో ఆ ముగ్గురు!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:30 AM GMT
శివ‌రాత్రికి మూవీ ట్రాఫిక్ జామ్.. బ‌రిలో ఆ ముగ్గురు!
X
క‌రోనా మహమ్మారి తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ నెమ్మదిగా తిరిగి ట్రాక్ లో ప‌డుతోంది. ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ఒక‌టి డ‌బ్బింగ్ ఖాతాలోకి వెళ్లిపోయిన‌ప్ప‌టికీ.. మూడు తెలుగు చిత్రాలు పొంగ‌ల్ బ‌రిలో నిలిచాయి. లాభ‌న‌ష్టాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. థియేట‌ర్ కు వ‌చ్చేందుకు జ‌నాలు మ‌ళ్లీ అల‌వాటు ప‌డుతున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది. దీంతో మిగిలిన సినిమాలు కూడా టాకీసుల బాట ప‌డుతున్నాయి.

ప‌రిస్థితి చూస్తుంటే.. ఇప్పటి నుండి ప్రతీ ఫ్రైడే ఓ కొత్త సినిమా వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌నిపిస్తోంది. అంతేకాదు.. కొన్నివారాల్లో ఒక‌టికి మించిన సినిమాలు కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎప్పుడో షూట్ పూర్తి చేసుకున్న సినిమాల‌న్నీ.. ల్యాబ్ ‌లోనే మూలుగుతున్నాయి. అవన్నీ.. ఇప్పుడు క్యూ క‌డుతున్నాయి.

ఈ క్ర‌మంలో.. రాబోయే మ‌హాశివ‌రాత్రి టార్గెట్ గా ప‌లు చిత్రాలు రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతున్నాయి. మార్చి 12 న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని బాక్సాఫీస్ వద్ద ప‌లు చిత్రాలు సంద‌డి చేయ‌బోతున్నాయి. ఇందులో ముఖ్యమైన చిత్రాలు మూడున్నాయి. ఇవ‌న్నీ.. మార్చి 11 న విడుదల కాబోతున్నాయి.

శర్వానంద్ శ్రీకరమ్ - శ్రీ విష్ణు గాలిసంపత్, నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు. ఈ మూడు సినిమాల‌ను 11న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమాల్లోని హీరోలు, ప్ర‌ధాన న‌టులు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తార‌నే ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ మూడు సినిమాల్లో గాలి సంపత్ మినహా.. మిగిలిన రెండు చిత్రాలు లాక్ డౌన్ కు ముందే పూర్త‌య్యాయి. గ‌తేడాది స‌మ్మ‌ర్ సీజ‌న్లోనే వీటిని విడుదల చేయవలసి ఉంది. కానీ.. క‌రోనా కార‌ణంగా ఆ చిత్రాలు ఇప్ప‌టికి పోస్ట్ పోన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీ క‌లెక్ష‌న్లపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుండ‌డంతో.. సినిమా రిలీజ్ కు పండ‌గ‌ల‌నే ఎంచుకుంటున్నారు నిర్మాత‌లు. మ‌రి, ఈ ముగ్గురిలో బాక్సాఫీస్ వ‌ద్ద ఎవ‌రు స‌త్తా చాటుతారో చూడాలి.