Begin typing your search above and press return to search.

హనీమూన్‌ కు రాధేశ్యామ్‌.. పిల్లలతో ఆదిపురుష్‌.. బతికి ఉంటే ఆ సినిమా

By:  Tupaki Desk   |   19 Sep 2020 3:00 PM GMT
హనీమూన్‌ కు రాధేశ్యామ్‌.. పిల్లలతో ఆదిపురుష్‌.. బతికి ఉంటే ఆ సినిమా
X
బాహుబలి.. సాహో సినిమాలకు ప్రభాస్‌ ఏళ్లకు ఏళ్లు తీసుకున్నాడు. సరే ఆ సినిమాలు భారీ సినిమాలు కనుక ఎక్కువ సమయం తీసుకున్నాడు అని అభిమానులు సర్దుకున్నారు. ఇప్పుడు రాధేశ్యామ్‌ సినిమాకు కూడా ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నాడు. రెండేళ్లు అయినా కూడా రాధేశ్యామ్‌ సినిమా రాలేదు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలను కూడా ప్రభాస్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాలకు ఎంత సమయం పడుతుందో అంటున్నారు. 2021లో ఒక సినిమా 2022లో రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడు. అయినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం ప్రభాస్‌ సినిమాల విషయంలో మీమ్స్‌ వస్తున్నాయి. విడుదలకు సంబంధించిన ఈ ట్రోల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రాధేశ్యామ్‌ సినిమాను మన పెళ్లి తర్వాత హనీమూన్‌ కు వెళ్లిన సమయంలో చూద్దాం.. ఆది పురుష్‌ మన పిల్లలతో చూడబోతున్న మొదటి సినిమా అవ్వనుంది. ఇక నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ చేయబోతున్న సినిమాను బతికి ఉంటే మన పిల్లలు మనని తీసుకు వెళ్తారు. అంటే చాలా ఆలస్యం అవుతుందని అర్థం. ఇది ఫన్నీగా ఉండి వైరల్‌ అవుతుంది.

ప్రభాస్‌ గత సినిమాల పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. చెప్పడానికి 2022లో విడుదల చేస్తామని ఆది పురుష్‌ మేకర్స్‌ మరియు నాగ్‌ అశ్విన్‌ లు ప్రకటించారు. కాని అది సాధ్యమేనా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ మాత్రం మూడు సినిమాలను రాబోయే రెండేళ్లలో విడుదల చేసి తన గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి ట్రోల్స్‌ కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నాడట.