Begin typing your search above and press return to search.

జగన్ ఇలాంటి వాటికి స్పందించాలా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 5:45 AM GMT
జగన్ ఇలాంటి వాటికి స్పందించాలా?
X
తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న నెటిజన్లపై హీరోయిన్ మీరా చోప్రా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు.. సీఎం వైఎస్ జగన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మీరాచోప్రాపై కొంతమంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.

తనకు ఎన్టీఆర్ గురించి తెలియదని.. తాను ఎన్టీఆర్ అభిమానిని కాదని.. మహేష్ బాబు అంటే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పినందుకు మీరా చోప్రాను కొంతమంది నెటిజన్లు అసభ్య పదజాలంతో తిడుతూ ట్విట్టర్ వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై మీరా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలకు గౌరవం లేదా.. మా గొంతును వినిపించనివ్వరా అని వాపోయింది. తనపై సామూహిక అత్యాచారం చేస్తామంటున్నారని.. యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు.

అయితే హీరోల మధ్య ఇగోను టచ్ చేసిన మీరాచోప్రా పై సదురు హీరో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇది సహజంలో సోషల్ మీడియాలో జరిగేదే. ప్రపంచం నలుమూలల నుంచి మీరాచోప్రాపై ఓ హీరో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. తిట్టి పోస్తున్నారు. అయితే హీరోయిన్ మీరా చోప్రా మాత్రం ఒక తెలుగు రాష్ట్ర సిఎంను ట్యాగ్ చేసి దీన్ని అరికట్టాలని ట్వీట్ లో కోరింది. దీనిపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

మీరాచోప్రాను బెదిరింపులకు గురిచేస్తున్న వారంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని.. తెలుగు అభిమానులు అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని వైయస్ జగన్ ను ఆమె ట్యాగ్ చేసారు. అయితే మీరాచోప్రా ఫిర్యాదు మాత్రం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసింది. ఆమెకు తెలంగాణలో ఆ హీరో అభిమానుల గురించి తెలియదు. మీరా చోప్రా కేవలం సీఎం జగన్ ను మాత్రమే ట్యాగ్ చేసి దీన్ని అరికట్టాలని కోరింది. కానీ ఫిర్యాదు చేసిన తెలంగాణ సీఎంను మాత్రం ఎందుకు ట్యాగ్ చేయలేదన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి ఎక్కువగా హైదరాబాద్ , విదేశాల నుంచే జరుగుతుంటాయి. వారందరినీ వదిలేసి ఏపీ సీఎంను మీరాచోప్రా ట్యాగ్ చేయడం ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇలాంటి వారికి సీఎం జగన్ స్పందించాలా? అనే వాదన కూడా వస్తోంది.