Begin typing your search above and press return to search.

నేను ఇప్పట్లో విలన్ వేషాలు వేయను: టాలీవుడ్ యువహీరో

By:  Tupaki Desk   |   7 July 2020 12:10 PM GMT
నేను ఇప్పట్లో విలన్ వేషాలు వేయను: టాలీవుడ్ యువహీరో
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ పై ప్రత్యేక అభిమానం ఏర్పరచుకున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని ఇప్పటికే తెలిపారు. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ కాస్త వేరుగా ఉంటుంది. అరవింద వీరరాఘవ రెడ్డిగా సినిమాలో ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్, బాషా యాస పలికించాడు త్రివిక్రమ్. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. ఇక అల వైకుంఠపురంలో.. తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేయనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లోపు విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టాడట. ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారని ఇదివరకే కన్ఫర్మ్ చేసాడు. మరో విషయం ఏంటంటే.. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారట. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ వార్తల పై మంచు మనోజ్ స్పందించి.. "నన్ను ఎన్టీఆర్ సినిమా గురించి ఎవరు సంప్రదించలేదని తేల్చేసాడు. అయినా నేను విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమే.. కానీ దానికి ఇంకా టైం ఉంది" అని తెలిపాడు. అయితే ఇంకా ఈ సినిమాలో విలన్ ఎవరనే దానిపై అధికారిక ప్రకటనగాని.. క్లారిటీ గాని రాలేదు. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం మనోజ్ సొంత నిర్మాణంలో అహం బ్రహ్మాస్మి.. సినిమా చేస్తున్నాడు. ఈ వార్త తెలిసిన అభిమానులు కాస్త ఖంగుతిన్నారని చెప్పవచ్చు.