Begin typing your search above and press return to search.
ఇడియట్స్ అలా చేయమని మీకు ఎవరు చెప్పారు!
By: Tupaki Desk | 6 April 2020 11:10 AM GMTకరోనాపై దేశం మొత్తం కూడా పోరు సాగిస్తున్న ఈ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ సమగ్రతను చాటుతూ మనమంతా ఐక్యంగా ఉన్నామనే భావన కలిగించేలా నిన్న రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పేసి ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించిన విషయం తెల్సిందే. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ చాలా ఇంట్రెస్ట్ తో పాల్గొన్నారు. మోడీ పిలుపును గౌరవించి తప్పకుండా రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాల్సిందిగా రెండు మూడు రోజుల నుండే స్టార్స్ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
నిన్న రాత్రి సమయంలో 9 గంటలకు దేశ వ్యాప్తంగా లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగించారు. ఆ సమయంలో కొందరు క్రాకర్స్ కాల్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చినట్లుగా శబ్దాలు వినిపించాయి. క్రాకర్స్ కాల్చిన వారిపై మంచు మనోజ్ తో పాటు పలువురు సోషల్ మీడియా లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రాకర్స్ కాల్చిన వారిపై విమర్శలు వెళ్లువెత్తాయి.
మంచు మనోజ్ ట్విట్టర్ లో... ఇడియట్స్ క్రాకర్స్ కాల్చడం ఆపేయండి. మిమ్ములను క్రాకర్స్ కాల్చమని ఎవరు అడగలేదు. నాకు తెలుసు జి బలిసిన ఎడ్యుకేటెడ్ వ్యక్తులే ఇలా చేసి ఉంటారు. దయచేసి మనుషుల్లా ఉందాం మృగాల మాదిరిగా రాక్షసుల మాదిరిగా ప్రవర్తించ వద్దంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ ను చాలా మంది అభినందించారు. క్రాకర్స్ కాల్చే వారు కేవలం ఇడియట్స్ మాత్రమే కాదు అంతకు మించి అంటూ పలువురు కామెంట్స్ చేశారు.
నిన్న రాత్రి సమయంలో 9 గంటలకు దేశ వ్యాప్తంగా లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగించారు. ఆ సమయంలో కొందరు క్రాకర్స్ కాల్చారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చినట్లుగా శబ్దాలు వినిపించాయి. క్రాకర్స్ కాల్చిన వారిపై మంచు మనోజ్ తో పాటు పలువురు సోషల్ మీడియా లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. క్రాకర్స్ కాల్చిన వారిపై విమర్శలు వెళ్లువెత్తాయి.
మంచు మనోజ్ ట్విట్టర్ లో... ఇడియట్స్ క్రాకర్స్ కాల్చడం ఆపేయండి. మిమ్ములను క్రాకర్స్ కాల్చమని ఎవరు అడగలేదు. నాకు తెలుసు జి బలిసిన ఎడ్యుకేటెడ్ వ్యక్తులే ఇలా చేసి ఉంటారు. దయచేసి మనుషుల్లా ఉందాం మృగాల మాదిరిగా రాక్షసుల మాదిరిగా ప్రవర్తించ వద్దంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ ను చాలా మంది అభినందించారు. క్రాకర్స్ కాల్చే వారు కేవలం ఇడియట్స్ మాత్రమే కాదు అంతకు మించి అంటూ పలువురు కామెంట్స్ చేశారు.