Begin typing your search above and press return to search.

కరోనా కోరల్లో చిక్కుకున్న మలయాళ స్టార్ హీరో..

By:  Tupaki Desk   |   3 April 2020 1:30 AM GMT
కరోనా కోరల్లో చిక్కుకున్న మలయాళ స్టార్ హీరో..
X
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇంతవరకు ఎనిమిది లక్షల మందికి పైగా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వేల మంది చనిపోతున్నారు. కరోనా ఈ రేంజ్ లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వైరస్ ని మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నారు. కరోనా వైరస్ కి వాక్సిన్ లేకపోవడమే ఇందుకు కారణం. అయితే కేంద్ర ప్రభుత్వాలు కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం పకడ్బందీ చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మన దేశానికి విదేశాల నుండి పాకిందని విషయం తెలిసిందే. భారతదేశంలో ఈ వైరస్ స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. దీంతో విదేశీయులను అనుమతించడం ఆపేశారు. మన దేశంలో కూడా రాకపోకలను నిలిపివేశారు.

మనదేశ ప్రజలు కూడా విదేశాల్లో భారీ సంఖ్యలో చిక్కుకుపోయారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళం స్టార్ హీరో తన మూవీ సిబ్బందితో ఇరుక్కుపోయారట. ఆడుజీవితం అనే మూవీ షూటింగ్‌ లో భాగంగా పృథ్వీరాజ్ - ఆయన బృందం జోర్డాన్‌ కు వెళ్లారు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్‌ ను అనుమతి ఇవ్వలేదట. తరువాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులు పొడిగించారని తెలిపాడు. కానీ కరోనా మాత్రం మరింత తీవ్రం కావడంతో షూటింగ్ పూర్తిగా నిలిపేశారు. అయితే అక్కడే ఒక హోటల్ రూమ్‌లో ఉన్నట్లు - వారితో ఒక డాక్టర్ ని కూడా ఉంచుకున్నారట. ఇదిలా ఉండగా హీరో పృథ్వీరాజ్ మాట్లాడుతూ తామంతా టీమ్ తో పాటు ఆరోగ్యాంగా ఉన్నట్లు తెలియజేసాడు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఇండియాకి వస్తామని తెలిపాడు.