Begin typing your search above and press return to search.

జూలైలో తిరిగి సెట్స్ లో అడుగుపెట్టనున్న 'మేజర్'..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
జూలైలో తిరిగి సెట్స్ లో అడుగుపెట్టనున్న మేజర్..!
X
టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అడవి శేష్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ''మేజర్''. శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ కనిపించనున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూలైలో మేజర్ షూట్ తిరిగి ప్రారంభమించి పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తామని అడవి శేష్ తాజాగా వెల్లడించారు.

అడవి శేష్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ప్రొడ్యూసర్ శరత్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ “మేము గత ఏడాది 'మేజర్' ప్రారంభించినప్పుడు.. చిట్ కుల్ ఎప్పుడూ చల్లగా ఉండదు. కానీ బ్రిలియంట్ విజువల్స్ మరియు అమేజింగ్ వ్యక్తులు గొప్ప జ్ఞాపకాలకు దారితీసింది. జూలైలో చిత్రీకరణ ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నాము. ఇది మేజర్ సందీప్ జీవితం నుంచి స్ఫూర్తి పొందిన ఒక ఎపిక్ స్టోరీ” అని పేర్కొన్నారు.

'మేజర్' చిత్రానికి అడవి శేష్ స్క్రిప్ట్ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడులలో బందీలను రక్షించి, వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ దేశవ్యాప్తంగా విశేష స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా సినిమా టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టి అందరి ప్రశంసలు అందుకుంది.

'మేజర్' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ మరియు ఇతర హక్కులకు ఫాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ అధిక ధరలకు అమ్ముడయ్యాయి. శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ''మేజర్'' చిత్రాన్ని నిర్మిస్తోంది.