Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ లో మ‌హేష్ సినిమా ఈసారైనా!

By:  Tupaki Desk   |   19 Oct 2021 4:45 AM GMT
గీతా ఆర్ట్స్ లో మ‌హేష్ సినిమా ఈసారైనా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ లైన‌ప్ చూస్తుంటే గ‌తంలో మాదిరి కాకుండా స్పీడ్ పెంచిన‌ట్లే క‌నిపిస్తొంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలైన రిలీజ్ చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నా ఎందుక‌నో అనుకున్న‌ట్టు అవ్వ‌డంలేదు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఏడాదికి ఒక‌ సినిమా రిలీజ్ చేయ‌డమే క‌ష్టంగా మారింది. మూడేళ్ల క్రిత‌మే మ‌హేష్ దూకుడుగా ప్లానింగ్ తో దిగారు కానీ ప్రాక్టిక‌ల్ గా సాధ్య‌మ‌వ్వ‌డంలేదు. మ‌ధ్య‌లో క‌రోనా కూడా ఆటంకం క‌లిగించింది. అయితే వ‌చ్చే ఏడాది నుంచైనా తాను అనుకున్న‌ది చేయాల‌ని మ‌హేష్ ఈసారి ప‌క్కా ప్లానింగ్ తో బ‌రిలో దిగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆ ర‌కంగా త‌న పీఆర్ టీమ్ ని జాగ్ర‌త్త ప‌డాల‌ని ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. అటుపై మ‌హేష్ త్రివిక్ర‌మ్.. రాజ‌మౌళి చిత్రాల‌ను ప్రారంభించ‌ను న్నారు. `స‌ర్కారు వారి పాట` సెట్స్ లో ఉండ‌గానే ఇత‌ర‌ క‌మిట్ మెంట్ ల‌పై వ‌ర్క్ చేసారు. స‌ర్కారు వారి పాట రిలీజ్ తో సంబంధం లేకుండా షూటింగ్ పూర్తికాగానే త్రివిక్ర‌మ్ తో ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. అటుపై ఈ సినిమా చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కి చేరుకోగానే జ‌క్క‌న్న చిత్రాన్ని లాంచ్ చేయాలని మ‌హేష్ భావిస్తున్నారుట‌. ఈలోపు రాజ‌మౌళి కూడా ఆర్ ఆర్ ఆర్ నుంచి పూర్తిగా రిలీవ్ అయిపోతారు.

కొంత గ్యాప్ తీసుకోవ‌డం కూడా పూర్త‌వుతుంది. ఈ రెండు లైన‌ప్ లో ఉండ‌గానే మ‌హేష్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ తో సినిమా చేయ‌డానికి ఒప్పందం చేసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్స్ట్ ప్ర‌తిష్టాత్మంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారుట‌. గ‌తంలో మ‌హేష్ -అనీల్ రావిపూడి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్టర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ కాన్ఫిడెన్స్ తోనే మెగా నిర్మాత వీళ్లిద‌రినీ సెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌హేష్‌- అనీల్ రావిపూడి కాంబినేష‌న్ ని మ‌రోసారి సెట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమాకు క‌థ-బౌండ్ స్క్రిప్ట్ ఇంకా సెట్ కాలేద‌న్న టాక్ వినిపించింది.

స‌ర్కార్ వారు త‌మిళ రిలీజ్ పైనా ఫోక‌స్

మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో నూ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేసేందుకు మైత్రి బృందం ప్లాన్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌హేష్ అండ్ టీమ్ చెన్నైలోనూ ప్ర‌చారం నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఓ ప్ర‌ముఖ టీవీ షో ప్ర‌చారం కోసం హాజ‌రైన సంద‌ర్భంగా త‌మిళ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఒక‌రు మ‌హేష్ తో క‌లిసి ఫోటో దిగారు. ఆ త‌ర్వాత ఆ ఫోటో మ‌హేష్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. ఇందులో మ‌హేష్ ఛామ్ పైనా త‌మిళ అభిమానులు కామెంట్లు చేసారు. మ‌హేష్ కి విశ్రాంతి కోసం స‌మ‌యాన్ని కేటాయించిన క్ర‌మంలో ఆ గ్యాప్ లోనే స‌ర్కార్ వారి టీవీ ప్ర‌చారం కోసం చెన్నై వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి. అప్ప‌ట్లో `స‌ర్కారు వారి పాట` టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. యూట్యూబ్ లో సీక్రెట్ గా లీకైన వీడియో వ‌ల్లా ప్ర‌చారం క‌లిసొచ్చింది. అటు చెన్నై త‌మిళ‌నాడులోనూ మ‌హేష్ సినిమాపై క్రేజు నెల‌కొంది.